తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి అంటుంటారు. అలాగే ఇండియాలో పౌరాణిక చిత్రాలు తీయటంలో తెలుగువారిదే పైచేయి అనేది వాస్తవ విషయం. దీనికి మహానటుడు యన్టీఆర్ నటనావైభవం ఓ కారణం కాగా, దర్శకుల ప్రతిభ కూడా మరో కారణమని చెప్పవచ్చు.
తెలుగు చిత్రపరిశ్రమకు సంక్రాంతి బాగా అచ్చివచ్చే సీజన్. ఆ టైమ్ లో స్టార్స్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆడియన్స్ ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్స్ సైతం తమ సినిమాలను సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా మాస్ మహరాజా రవితేజ నటించే ‘ఈగల్’ మూవీ 2024 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' ఈ నెల 16న విడుదల కానుంది. 'ఆదిపురుష్' విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ ఎలా సాగింది అన్న అంశంపై చర్చ కూడా సాగుతోంది.
ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ 'జవాన్'గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతి నెలా #AskSRK సెషన్లో షారూక్ ఖాన్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంటాడు. అందులో భాగంగా ఇటీవల ఫ్యాన్స్ తో మాట్లాడాడు షారూఖ్.
తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన మహోన్నతులైన దర్శకుల్లో వీరమాచినేని మధుసూదనరావు అలియాస్ విక్టరీ మధసూదనరావు ఒకరు. ఆత్మబలం, గుడిగంటలు, కల్యాణమంటపం, లక్షాధికారి, భక్తతుకారం, పదండి ముందుకు, ఆరాధన, మనుషులు మారాలి, మల్లెపూవు, చక్రవాకం, వీరాభిమన్యు, రక్తసంబంధం, విక్రమ్, సామ్రాట్… ఇలా దాదాపు 71 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువ శాతం విజయాలను స్వంతం చేసుకుని విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న ప్రతిభాశాలి వి మధుసూదనరావు. 1923 జూన్ 14న జన్మించిన ఆయన ఈ ఏడాది వంద సంవత్సరాలు […]
Tollywood Star Heros Aiming 2023 Second Half: ఈ యేడాది ఫస్ట్ ఆఫ్ కన్నామిన్నగా సెకండాఫ్ లో స్టార్స్ వార్ సాగబోతోంది. ఆరంభంలో బాలకృష్ణ, చిరంజీవి పొంగల్ బరిలో చేసిన హంగామా మళ్ళీ కనిపించలేదు. కానీ ద్వితీయార్ధంలో అలాంటి సీన్ మరింతగా కనిపించనుంది. ఈ సందడి జూలై నుండీ మొదలు కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదల కానుంది. తమిళంలో సక్సెస్ […]
Padma Shri: బాలనటుడుగా కెరీర్ ప్రారంభించి నలభై అయిదు సంవత్సరాల పాటు సినిమారంగంలో హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడని అలనాటి నటి రాజశ్రీ అన్నారు. హైదరాబాద్ లో సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామెడీ ఫెస్టివల్ లో హాస్య నటుడు అలీని సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు కింద వెండి కిరీటం, వెండి కంకణం బహుకరించారు. Read Also: Durgam Chinnaiah : బెల్లంపల్లి ఎమ్మెల్యే […]
Gopichand: మాస్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రూపం మేచోమేన్ గోపీచంద్ సొంతం. జూన్ 12తో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటునిగా 30 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా 'భీమా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 'రామబాణం'తో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ తన 31వ చిత్రంగా 'భీమా'ను జనం ముందు నిలిపే ప్రయత్నంలో ఉన్నారు.
'కాస్ట్యూమ్స్' కృష్ణ పేరు వినగానే ఆయన విలక్షణమైన వాచకం ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ తరువాతే ఆయన అభినయమూ స్ఫురిస్తుంది. వెరసి విలక్షణ నటునిగా జనం మదిలో చోటు సంపాదించారాయన.