Padma Shri: అలీకి ‘పద్మశ్రీ’ ఇవ్వాలంటున్న అలనాటి నటి రాజశ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padma Shri: బాలనటుడుగా కెరీర్ ప్రారంభించి నలభై అయిదు సంవత్సరాల పాటు సినిమారంగంలో హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడని అలనాటి నటి రాజశ్రీ అన్నారు. హైదరాబాద్ లో సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామెడీ ఫెస్టివల్ లో హాస్య నటుడు అలీని సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు కింద వెండి కిరీటం, వెండి కంకణం బహుకరించారు.
Read Also: Durgam Chinnaiah : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు
Also Read
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ.. ‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. అతనిలో ఉన్న సేవా గుణం అందరికి స్ఫూర్తినిస్తుంది. అలుపెరగక కళా జీవితాన్ని గడుపుతున్న అలీ జన్మ ధన్యమైంది. అతనికి ‘పద్మశ్రీ’ వస్తే చూడాలని వుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటులు తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మి పాల్గొని అలీని అభినందించారు.
Read Also: Avika Gor: పాప.. నోరు అదుపులో పెట్టుకో .. మళ్లీ టాలీవుడ్ లో కనిపించవ్
ఈ సందర్భంగా అలనాటి కాంతారావు కుమారుడు రాజా, హాస్య నటి పాకీజా, కళాకారిణి హేమకుమారికి వ్యాపారవేత్త శ్రీ వె. రాజశేఖర్ పాతిక వేల ఆర్ధిక సాయాన్ని అందించారు. ‘సంగమం’ సంజయ్ కిషోర్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జయలలిత, పాకీజా, రాగిణి, శివారెడ్డి, సునామి సుధాకర్, బులెట్ భాస్కర్, నాటీ నరేష్, హరిబాబు, పేరడీ గురుస్వామి, సంకర నారాయణ ప్రదర్శించిన హాస్యవల్లరి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
-
Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!