తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్పై ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు మధ్యాహ్నం సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో అంజనీ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీ కుమార్తో పాటు ఇద్దరు అదనపు డీజీలు సందీప్కుమార్ జైన్, మహేశ్ భగవత్కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. డీజీపీ అంజనీ కుమార్ను ఈ రోజు మధ్యాహ్నం ఈసీ చేసింది. […]
Young Candidates Won in Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 సీట్లు (మ్యాజిక్ ఫిగర్ 60) కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం 7 సీట్లలో […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ (బీజేపీ) ఖాతా తెరవలేదు. పోటి చేసిన ఇద్దరు ఎంపీలు పరాజయం పాలయ్యారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సైతం ఓటమి చెందారు. దాంతో మూడు చోట్ల రెండవ స్థానంతో కమల నాథులు సరిపెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడి ఓడారు. వరుసగా మూడు సార్లు గంగుల చేతిలో ఓడిపోవడం విశేషం. కోరుట్ల నుంచి […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్పై కౌశిక్ రెడ్డి గెలిచారు. విజయం అనంతరం హుజురాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈటెలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని.. కౌశిక్తో ఇలాగే ఉంటదన్నారు. ‘నా గెలుపుకు కారణమైన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా నోరు […]
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. […]
BJP Winning candidates in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో హ్యాట్రిక్ కొడదామని ఆశించిన బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు కూడా గెల్వలేకపోయింది. బీజేపీ అగ్ర నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులకు చుక్కెదురైంది. దాంతో తెలంగాణలో బీజేపీ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఈ లిస్ట్ ఓసారి చూద్దాం. 1 నిర్మల్ […]
Kavitha Kalvakuntla Tweet on BRS Defeat: అధికారం ఉన్నా లేకున్నా.. తాము తెలంగాణ ప్రజల సేవకులమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు మరియు కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినందనలు తెలిపారు. దేవుడు తెలంగాణను ఆశీర్వదిస్తాడని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ను దాటేసింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికి 25 స్థానాలు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టలేకపోయింది. కల్వకుంట్ల […]
Kadiyam Srihari Says We will play the role of opposition: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించారని, నిండు మనసుతో ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో కేసీఆర్ నిలబెట్టారు, అయితే ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నా అని కడియం పేర్కొన్నారు. కడియం శ్రీహరి 7,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సిగపురం ఇందిరాపై విజయం సాధించారు. […]
Revanth Reddy Tweet on Kodangal Peoples: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. 32,532 మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 107429 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 84897 ఓట్లు […]