Arshdeep Singh: నా వల్లే భారత జట్టు ఓడిపోతుందని భయపడ్డా: అర్ష్దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh React on IND vs AUS Last Over: ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మాథ్యూ వేడ్ను ఔట్ చేయడంతో పాటు కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్దీప్.. తన వల్లే టీమిండియా ఓడిపోతుందని భయపడ్డాడ్డాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతడే స్వయంగా తెలిపాడు.
ఐదవ టీ20 మ్యాచ్లో తొలి మూడు ఓవర్లలో భారీగా పరుగులివ్వడంతో.. భారత జట్టు ఓటమికి తాను కారణం అవుతానని ఆందోళనకు గురయ్యానని అర్ష్దీప్ సింగ్ చెప్పాడు. అయితే చివరి ఓవర్ రూపంలో తనకు మరో అవకాశం దక్కిందని, భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ‘ఈ మ్యాచ్లో మొదటి మూడు ఓవర్లు ధారళంగా పరుగులివ్వడంతో నా వల్లే జట్టు ఓడిపోతుందని ఆందోళనకు గురయ్యా. కానీ ఆ దేవుడు చివరి ఓవర్ రూపంలో నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఆ దేవుడికి కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన కెప్టెన్ సూర్యకుమార్, సపోర్ట్ స్టాప్కు ధన్యవాదాలు’ అని అర్ష్దీప్ తెలిపాడు.
Also Read
Also Read: Huge No Ball: ఇది నో బాల్ కాదు.. అంతకుమించి!
‘చివరి బౌలింగ్ చేస్తున్నప్పుడు నా మదిలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. సూర్య భాయ్ నా వద్దకు వచ్చి ఒక్కటే చెప్పాడు. ఏమి జరిగినా నిర్భయంగా బౌలింగ్ చేయమన్నాడు. ఈ విజయం క్రెడిట్ మా బ్యాటర్లదే. బ్యాటింగ్కు కఠినంగా ఉన్న పిచ్పై పోరాడే లక్ష్యాన్ని అందించారు. ఈ సిరీస్లో నా వ్యక్తిగత ప్రదర్శన బాగా లేదు. నా బౌలింగ్ తీరును సమీక్షించుకుని భవిష్యత్తులో మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ నాకు ఓ గుణపాఠం. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని అర్ష్దీప్ సింగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్దీప్.. 2 వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. తొలి మూడు ఓవర్లలోనే ఏకంగా 36 పరుగులు ఇచ్చాడు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!