Mohali kabaddi Firing: కబడ్డీ టోర్నమెంట్లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
- మొహాలిలోని సోహ్నా ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన
- టోర్నమెంట్ నిర్వాహకుడు మృతి
- కబడ్డీ ప్లేయర్కు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohali kabaddi Firing: పంజాబ్ మొహాలిలోని సోహ్నా ప్రాంతంలో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్లో కాల్పుల కలకలం చెలరేగింది. కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సెక్టార్ 82 మైదానంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులకు పాల్పడిన వాళ్లు బైక్పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల్లో ఒక కబడ్డీ ఆటగాడు, టోర్నమెంట్ నిర్వాహకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీళ్లిద్దరిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిర్వాహకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
READ ALSO: IND vs SA: టీ20 సిరీస్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్.. మరి బుమ్రా సంగతేంటి?
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ టోర్నమెంట్కు వచ్చిన చాలా మంది మొదట్లో ఆ కాల్పుల శబ్దాన్ని పటాకుల చప్పుడుగా భావించారని అన్నారు. నిజానికి మ్యాచ్ సమయంలో ప్రేక్షకుల మీదుగా దాదాపు ఆరు సార్లు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. కబడ్డీ ఆటగాళ్ళు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ కాల్పులు జరిగాయని అన్నారు. కాల్పుల తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వాస్తవానికి ప్రముఖ గాయకుడు మన్కీర్ట్ ఔలాఖ్ కూడా ఈ టోర్నమెంట్కు హాజరు కావాల్సి ఉంది.
సోహానా పట్టణంలో బెడ్వాన్ స్పోర్ట్స్ క్లబ్ నాలుగు రోజుల కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్లో అనేక జట్లు పాల్గొంటున్నాయి. అయితే సోమవారం సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్లో కాల్పులు జరిగాయి. నిర్వాహకుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్, అలియాస్ రాణా బాలచౌరియా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వాళ్లు రాణా బాలచౌరియాపై నేరుగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా బాలచౌరియా మరణించారు.
మొహాలీ ఎస్ఎస్పీ హర్మన్దీప్ సింగ్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుల కోసం వెతకడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించడానికి కెమెరాల రికార్డింగ్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నలుగురు నుంచి ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారని అన్నారు.
READ ALSO: Zodiac Predictions 2026: ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో దరిద్రం దండిగా ఉంటుందట!
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?