CM Chandrababu: కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే!
- నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు
- కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే
- రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికపై మాట్లాడారు.
‘ఈ రోజు మే డే. ఈరోజున కార్మికులు, కష్టజీవులు గుర్తుకొస్తారు. కార్మికులను దోపిడీ చేనేకుండా అనునిత్యం వారి తరఫున పోరాడి వారికి న్యాయం చేయడానికి పునరంకితమవుతాం. మన రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు. ఇందులో వ్యవసాయంపై ఆధారపడిన వారే అధికం. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోంది. భవన నిర్మాణరంగంలో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలో కార్మికుల కోసం చక్రాన్ని పెట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతున్నాం. కేంద్ర రాష్ట్రాలలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని వల్ల సులభంగా ఇసుక దొరుకుతోంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే లక్షా 2 వేల కోట్లు అప్పు తెచ్చినా..
‘నిర్మాణ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని కూడా రద్దు చేశా. భవనాల నిర్మాణ అనుమతులలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన భూముల సమీకరణకు రైతులు సహకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు జాతికి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. అమరావతిలో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చు లేకుండా రాజధానిని నిర్మిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
- Tags
- ap
- cm chandrababu
- may day
- Nellore
- tdp
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!