YCP: వైసీపీలో నూతన నియామకాలు.. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే!
- గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని వైఎస్ జగన్ నిర్ణయం
- వైసీపీపార్టీలో నూతన నియామకాలు
- పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని నిర్ణయం తీసుకున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలో నూతన నియామకాలు జరిగాయి. పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను జగన్ చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను వైఎస్ జగన్ నియమించారు. గత ఫిబ్రవరిలో వైసీపీలో శైలజానాథ్ చేరిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి వీరాంజనేయులును వైఎస్ జగన్ బరిలో నిలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులుకు సీట్ ఇస్తే.. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయ పరిస్థితుల్లో శైలజానాథ్ను శింగనమల వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజానాథ్ విజయం సాధించారు. ఇక ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు జగన్ ఆదేశాల మేరకు పరిశీలకుల నియమకం జరిగింది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
Also Read
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు:
1) శ్రీకాకుళం – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ
2) విజయనగరం – కిల్లి సత్యనారాయణ
3) అరకు – బొడ్డేటి ప్రసాద్
4) అనకాపల్లి – శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యే
5) విశాఖపట్నం – కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే
6) కాకినాడ – సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ
7) అమలాపురం – జక్కంపూడి విజయలక్ష్మి
8) రాజమండ్రి – తిప్పల గురుమూర్తి రెడ్డి
9) నరసాపురం – ముదునూరి మురళీ కృష్ణంరాజు
10) ఏలూరు – వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
11) మచిలీపట్నం – జెట్టి గురునాథం
12) విజయవాడ – మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ ఎంపీ
13) గుంటూరు – పోతిన మహేష్
14) నరసరావుపేట – పూనూరు గౌతంరెడ్డి
15) బాపట్ల – తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ
16) ఒంగోలు – బత్తుల బ్రహ్మానందరెడ్డి
17) నెల్లూరు – జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
18) తిరుపతి – మేడా రఘునాథ రెడ్డి, ఎంపీ
19) చిత్తూరు – చవ్వా రాజశేఖర రెడ్డి
20) రాజంపేట – కొత్తమద్ది సురేష్ బాబు, మేయర్
21) కడప – కొండూరు అజయ్ రెడ్డి
22) అనంతపురం – బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
23) హిందూపురం – ఆర్. రమేష్ రెడ్డి
24) నంద్యాల – కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
25) కర్నూలు – గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!