YCP: వైసీపీలో నూతన నియామకాలు.. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే!
- గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని వైఎస్ జగన్ నిర్ణయం
- వైసీపీపార్టీలో నూతన నియామకాలు
- పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని నిర్ణయం తీసుకున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలో నూతన నియామకాలు జరిగాయి. పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను జగన్ చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను వైఎస్ జగన్ నియమించారు. గత ఫిబ్రవరిలో వైసీపీలో శైలజానాథ్ చేరిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి వీరాంజనేయులును వైఎస్ జగన్ బరిలో నిలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులుకు సీట్ ఇస్తే.. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయ పరిస్థితుల్లో శైలజానాథ్ను శింగనమల వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజానాథ్ విజయం సాధించారు. ఇక ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు జగన్ ఆదేశాల మేరకు పరిశీలకుల నియమకం జరిగింది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు:
1) శ్రీకాకుళం – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ
2) విజయనగరం – కిల్లి సత్యనారాయణ
3) అరకు – బొడ్డేటి ప్రసాద్
4) అనకాపల్లి – శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యే
5) విశాఖపట్నం – కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే
6) కాకినాడ – సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ
7) అమలాపురం – జక్కంపూడి విజయలక్ష్మి
8) రాజమండ్రి – తిప్పల గురుమూర్తి రెడ్డి
9) నరసాపురం – ముదునూరి మురళీ కృష్ణంరాజు
10) ఏలూరు – వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
11) మచిలీపట్నం – జెట్టి గురునాథం
12) విజయవాడ – మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ ఎంపీ
13) గుంటూరు – పోతిన మహేష్
14) నరసరావుపేట – పూనూరు గౌతంరెడ్డి
15) బాపట్ల – తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ
16) ఒంగోలు – బత్తుల బ్రహ్మానందరెడ్డి
17) నెల్లూరు – జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
18) తిరుపతి – మేడా రఘునాథ రెడ్డి, ఎంపీ
19) చిత్తూరు – చవ్వా రాజశేఖర రెడ్డి
20) రాజంపేట – కొత్తమద్ది సురేష్ బాబు, మేయర్
21) కడప – కొండూరు అజయ్ రెడ్డి
22) అనంతపురం – బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
23) హిందూపురం – ఆర్. రమేష్ రెడ్డి
24) నంద్యాల – కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
25) కర్నూలు – గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!