Is Krithi Shetty Comeback With Love Insurance Company: ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దాదాపు ఏడు నెలల క్రితమే తమిళంలో వచ్చిన ఈ టీజర్ను.. ఇప్పుడు చిన్నపాటి మార్పులతో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ […]
Shreyas Iyer Captaincy Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్సీ అనేది ఒక కళ. మెగా లీగ్లో అద్భుత జట్టును విజయవంతంగా నడిపించడం సాధారణ విషయమే. అయితే సాధారణ స్థాయిలో ఉన్న జట్టును ప్లేఆఫ్స్, ఫైనల్స్ వరకు తీసుకెళ్లడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అతడి కెప్టెన్సీ రికార్డులు చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఎంత ప్రభావం చూపాడో ఇట్టే […]
Shreyas Iyer Tops PBKS and KKR Captaincy Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో కెప్టెన్సీ అనేది ప్రత్యేకం. ఇక్కడ నిరూపించుకుంటే.. భారత జట్టును సారథ్యం వహించే అవకాశాలు మెరుగవుతాయి. కెప్టెన్సీ అంటే కేవలం జట్టును నడిపించడం మాత్రమే కాదు.. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకుని టీంను విజయపథంలో నడిపించడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ముద్ర వేస్తున్నాడు. శ్రేయస్ నాయకత్వం వహించిన జట్లలో […]
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ తండ్రికి సీఎం సహాయనిధి ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఏ.అరవింద్ మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా […]
శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి జూపల్లి హెచ్చరించారు. పాలమూరు రైతాంగానికి నష్టం చేయొద్దని, నష్టం జరిగితే ఊరుకోమన్నారు. 64 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాలపడొద్దన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిందని.. పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉందన్నారు. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందని.. ఏపీ ఇప్పుడు […]
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ మగ శిశువును కన్నవారే నిర్దాక్షిణ్యంగా ముల్లపొదల్లో వదిలేసి వెళ్లారు. ఆ అమాయక పసిబిడ్డ ఏడుపు గ్రామాన్ని కదిలించింది. ఒక అపరిచిత మహిళ చూపిన మానవత్వంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బూరగాం గ్రామానికి చెందిన ఓ మహిళకు ముల్లపొదల వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా.. చీమలు కుడుతున్న పరిస్థితిలో, […]
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల వద్ద పులి కదలికలు గుర్తించడంతో.. గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బోడిగూడెం, డి. రావి లంక–దండంగి గ్రామాల మధ్య పులి తిరిగినట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. టెలికాలర్ సాయంతో పులి ఎక్కడ సంచరిస్తోందో ట్రాక్ చేస్తున్నారు. ట్రాన్స్మీటర్, వీఎచ్ఎఫ్ యాంటెన్నా ద్వారా […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న టీమిండియా కీపర్ సంజు శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లోకి చేరాడు. అయితే కొత్త జట్టు సీఎస్కేతో ఆరంభం అతడికి కలిసి రాలేదు. తన మాజీ జట్టు రాయల్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో సంజు కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆర్ఆర్ బౌలర్ నాంద్రే బర్గర్ […]
Ravindra Jadeja About To Play For Rajasthan Royals in IPL 2026: ఐపీఎల్ 2026లో జట్ల మార్పులు, కొత్త కాంబినేషన్లు క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున బరిలోకి దిగడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. సోమవారం గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా ఆర్ఆర్ తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2026 ముందు ట్రేడ్ […]
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో నాయుడుపేటలో టిడ్కో లబ్ధిదారులతో కలిసి సీఎం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలు […]