ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు’ నేడు రాజ్యసభలో చర్చకు రానుంది. ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు గంటపాటు కీలక చర్చ జరగనుంది. ఈ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు.. నేడు […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ప్రారంభమై ఐదు రోజులు కాగా.. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ను ఆడేశాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఎన్నో అద్భుత క్షణాలను మనం ఆస్వాదించాం. అద్భుత బ్యాటింగ్, సూపర్ క్యాచ్, బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు కాగా.. బుధవారం జరిగిన మ్యాచ్లో నమోదైన ఒక బంతి మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి వేసిన ఆ అద్భుత డెలివరీ ఇప్పటి వరకు ఈ సీజన్లో ‘బెస్ట్ బాల్’గా నిలిచింది. […]
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ […]
కొండ నాలికకు మందు వేస్తే…ఉన్న నాలిక ఊడినట్టయ్యిందని టీడీపీ భావిస్తోందా ? ఎక్కడి నుంచో తీసుకొచ్చి…ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తే…పార్టీని కంపు కంపు చేసేశాడా ? ఆయనతోపాటు మనము పాతుకుపోదాం అనుకున్న నేతల పునాదులు కదిలినట్టు భావిస్తున్నారా ? అటు పార్టీకి…ఇటు వ్యక్తిగతంగా జరిగిన డ్యామేజ్ను కవర్ చేసేందుకు అనుచరులు ప్రయత్నిస్తున్నారా ? ఇంతకీ ఎవరా నేత ? ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరిస్థితి…ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైందని పార్టీ నేతలు […]
కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తి, శ్రద్ధల సమ్మేళనంగా తెప్పోత్సవం కొనసాగింది. విశేష పూజలతో పాటు, కన్నుల పండుగగా జరిగింది. వేకువజామున ఆలయ అర్చకుల మేల్కొలుపుతో ప్రారంభమైన ఈ మహోత్సవంలో గౌతమి గోదావరి పవిత్ర జలాలను తెచ్చి స్వామివారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నిత్యార్చన, నిత్య హోమాలు, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం వంటి వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారు అమ్మవార్లకు విశేష పూజారి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కొన్ని మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమ జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని కొన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస, బూర్జ మండలాలు, విజయనగరం జిల్లాలో సంతకవిటి, పార్వతీపురం […]
పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుండగా.. ఇప్పుడు నిర్మాణ రంగంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంట్ ధరలు పెరుగుతాయా? అన్న చర్చ జరుగుతుండగానే.. సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాన్-ట్రేడ్ కస్టమర్లకు సిమెంట్ ధరలను ఏకంగా రూ.50 వరకు పెంచాయి. దీంతో ప్రస్తుతం 280 నుంచి 320 రూపాయల వరకు ఉన్నా.. తర్వాత 370 వరకు పెరగనుంది. కొన్నిచోట్ల 420 రూపాయల వరకు కూడా పెరుగుతుంది. సిమెంట్ కంపెనీల […]
ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందిందన్నారు. చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారని.. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదని.. అవినీతి అంటాడు, జీఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2028 ఆగస్టుకి రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం […]
పోలవరం పరిధిలోని దేవీపట్నం మండలం రామదుర్గం కొండల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో తిరుగుతున్న పులి.. తాజాగా రామదుర్గం కొండ పరిసరాల్లో కనిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో రాజానగరం మండలంకు చెందిన సుమారు 50 మంది సందర్శకులు యాత్ర నిమిత్తం రామదుర్గం కొండకు వెళ్లి చిక్కుకుపోయారు. పులి సంచారం విషయం తెలియక వెళ్లిన వీరు.. ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. Also Read: APSPDCL Scam: […]
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సబ్-స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ నియామకాలలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. పొరుగు సేవల ద్వారా జరిగిన ఈ నియామకాలలో నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు సాధించిన వారిపై సంస్థ కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యవహారంపై స్పందించిన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి.. పలు జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సబ్-స్టేషన్లలో […]