Ram Charan: ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్కు మంత్రి!
- ఏపీఎల్ సీజన్-5 చివరి దశకు రంగం సిద్ధం
- నేటి నుంచి మ్యాచ్లు ప్రారంభం
- ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan to Attend APL 2026 Opening in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 చివరి దశకు రంగం సిద్ధమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో తొలి దశ విశాఖపట్నంలో, రెండో దశ కడపలో విజయవంతంగా నిర్వహించగా.. చివరి దశ మ్యాచ్లకు అమరావతి ఆతిథ్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలిచింది.
ఏపీఎల్ చరిత్రలో తొలిసారిగా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్టేడియాన్ని అత్యాధునిక సదుపాయాలతో సిద్ధం చేశారు. లీగ్ చివరి దశలో మొత్తం 12 మ్యాచ్లు మంగళగిరిలో జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం రెండు మ్యాచ్ల చొప్పున అభిమానులను అలరించనున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో చివరి దశ పోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లపై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ఏపీఎల్ ప్రారంభ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. చరణ్ రాకతో టోర్నీకి మరింత ఆకర్షణ ఏర్పడింది. ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27తో లీగ్ దశ ముగియనుండగా, జూన్ 28 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. జూన్ 30న జరిగే గ్రాండ్ ఫైనల్తో ఏపీఎల్ సీజన్-5 ముగియనుంది. ఫైనల్ మ్యాచ్కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. క్రికెట్, వినోదం, సెలబ్రిటీ సందడి కలగలిపిన ఏపీఎల్ సీజన్-5 చివరి దశకు మంగళగిరి వేదిక కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈ స్థాయి క్రికెట్ టోర్నీ జరగడం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!