Bhatti Vikramarka : కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మల్లన్నపాలెం గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో […]
Beerla Ilaiah : తెలంగాణలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కవిత ఇప్పటికైనా తెలంగాణ పట్ల సోయి చూపించడం గమనార్హమని చెప్పారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఇప్పుడు కవితకు అర్థమవుతోందంటే, గత 10 ఏళ్లలో తండ్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు ఆమె గుర్తించుకుంటున్నట్లు తెలుస్తోందని ఐలయ్య […]
DOST 2025: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త! ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్ణ రెడ్డి , కళాశాల విద్యా శాఖ కమిషనర్ శ్రీ దేవ సేన సంయుక్తంగా డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ (దోస్త్) 2025-26 నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సందర్భంగా చైర్మన్ బాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి మూడు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని […]
Niranjan Reddy : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిపై ప్రత్యేకంగా మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం మాతృద్రోహం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా తట్టెడు మన్ను కూడా […]
HYDRA Police Station : హైదరాబాద్ నగరంలో భారీ స్పందన పొందిన హైడ్రా (HYDRAA) ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రత్యేక విభాగానికి ఇటీవల ప్రభుత్వం మరిన్ని అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా, మే 8వ తేదీన ముఖ్యమంత్రి […]
Canabarro Lucas : కాలం ఒక నది లాంటిది. ఎందరినో తనలో కలుపుకొని సాగిపోతూ ఉంటుంది. అలాంటి కాలపు ప్రవాహంలో ఒక అరుదైన జ్ఞాపకంలా నిలిచిన కనబారో లుకాస్ ఇక లేరు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఈ బ్రెజిలియన్ సన్యాసిని 116 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె 117వ పుట్టినరోజుకు కేవలం కొన్ని వారాల ముందు మరణించడం విషాదకరం. 1908 జూన్ 8న బ్రెజిల్లోని రియో గ్రాండే డో సుల్లో జన్మించిన కనబారో, తన […]
World Tuna Day : టూనా అనేది బాంగుడే, బుథాయ్, సిల్వర్ ఫిష్ , ఏంజెల్ ఫిష్ వంటి ఒక రకమైన చేప, ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది. ఇతర చేపలతో పోలిస్తే, టూనా చేపలో ఒమేగా-3, విటమిన్ బి12, ప్రోటీన్ , విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా, ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువలన, అధిక చేపలు పట్టడం వల్ల, టూనా చేపల సంఖ్య నిరంతరం తగ్గుతోంది. సముద్ర పర్యావరణ వ్యవస్థ […]
Viral News : ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఒక మధురమైన జ్ఞాపకం. ఆడుతూ పాడుతూ గడిపిన రోజులు, చిన్ననాటి స్నేహితులు, పెరిగిన ఇంటి పరిసరాలు… ఇవన్నీ తలచుకుంటే ఒక తెలియని ఆనందం కలుగుతుంది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతమంది అనివార్య కారణాల వల్ల తమ ఊరిని, తమ బాల్యాన్ని వదిలి వేరే చోటకు వెళ్లాల్సి వస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త స్నేహితులు దొరికినా, పాత జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ గుండెల్లో పదిలంగా ఉంటాయి. […]
ACB : తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్పోర్టులను అధికారులు ఇప్పటికే […]
MLC Kavitha : తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడినా.. సామాజికంగా సమానత్వం ఇంకా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం మే డే సందర్భంగా ఆమె నివాసంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కింద భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందుతోందని, కానీ భూమిలేని కార్మికుల విషయానికి వస్తే ప్రభుత్వం వైఫల్యం చెందిందని […]