Gadwal Murder : ఐదుసార్లు తప్పించుకున్న తేజేశ్వర్… ఆరోసారి బలయ్యాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
- జీపీఎస్ ట్రాకర్తో భర్తను వెంబడించి
- ప్రియుడితో కలిసి హత్య పథకం
- ఐదుసార్లు హత్యను తప్పించుకున్న తేజేశ్వర్ ఆరోసారి బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Murder : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ప్రేమ సంబంధం ఉంది. తన భార్యకు పిల్లలు లేనని చెప్పి, ఐశ్వర్యను రెండో భార్యగా తీసుకునేందుకు ఆమెతో చీకటి బంధాన్ని కొనసాగించాడు.
MIlk : పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
ఇదే సమయంలో ఐశ్వర్య.. తేజేశ్వర్ నిశ్చితార్థం కూడా తాత్కాలికంగా రద్దవ్వగా, తర్వాత మాయ మాటలతో తేజేశ్వర్ను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా బ్యాంకు మేనేజర్తో సంబంధాన్ని కొనసాగిస్తూ.. తేజేశ్వర్ అడ్డు తొలగించాలనే కుట్రకు దిగింది. ఈ క్రమంలో ఐశ్వర్య తేజేశ్వర్ బైక్కు సీక్రెట్గా జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. అతని ప్రతి కదలికను తెలుసుకుంటూ, డేటాను బ్యాంకు మేనేజర్కు చేరవేసింది. రూ.75,000 సుపారీకి హత్యకు ప్లాన్ రూపొందించి, ఓ గ్యాంగును రంగంలోకి దింపింది.
ఈ కుట్ర మొత్తం ఐదుసార్లు విఫలమవగా, ఆరోసారి తేజేశ్వర్ హంతకుల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. సర్వే పనిమీద అని చెప్పి తేజేశ్వర్ను ఓ కారు ద్వారా పిలిపించి, కారులోనే అతని గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని తాళ్లతో కట్టిపెట్టి, ఓ కవర్లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం సమీపంలోని గాలేరి నగర కాల్వలో వదిలేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసును దర్యాప్తు చేయగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్ హత్యకేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హంతకుడు మనోజ్, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
Chengalpattu Express Robbery: చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. కేబుల్ కత్తిరించి..!
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!