Gadwal Murder : ఐదుసార్లు తప్పించుకున్న తేజేశ్వర్… ఆరోసారి బలయ్యాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
- జీపీఎస్ ట్రాకర్తో భర్తను వెంబడించి
- ప్రియుడితో కలిసి హత్య పథకం
- ఐదుసార్లు హత్యను తప్పించుకున్న తేజేశ్వర్ ఆరోసారి బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Murder : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ప్రేమ సంబంధం ఉంది. తన భార్యకు పిల్లలు లేనని చెప్పి, ఐశ్వర్యను రెండో భార్యగా తీసుకునేందుకు ఆమెతో చీకటి బంధాన్ని కొనసాగించాడు.
MIlk : పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
ఇదే సమయంలో ఐశ్వర్య.. తేజేశ్వర్ నిశ్చితార్థం కూడా తాత్కాలికంగా రద్దవ్వగా, తర్వాత మాయ మాటలతో తేజేశ్వర్ను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా బ్యాంకు మేనేజర్తో సంబంధాన్ని కొనసాగిస్తూ.. తేజేశ్వర్ అడ్డు తొలగించాలనే కుట్రకు దిగింది. ఈ క్రమంలో ఐశ్వర్య తేజేశ్వర్ బైక్కు సీక్రెట్గా జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. అతని ప్రతి కదలికను తెలుసుకుంటూ, డేటాను బ్యాంకు మేనేజర్కు చేరవేసింది. రూ.75,000 సుపారీకి హత్యకు ప్లాన్ రూపొందించి, ఓ గ్యాంగును రంగంలోకి దింపింది.
ఈ కుట్ర మొత్తం ఐదుసార్లు విఫలమవగా, ఆరోసారి తేజేశ్వర్ హంతకుల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. సర్వే పనిమీద అని చెప్పి తేజేశ్వర్ను ఓ కారు ద్వారా పిలిపించి, కారులోనే అతని గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని తాళ్లతో కట్టిపెట్టి, ఓ కవర్లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం సమీపంలోని గాలేరి నగర కాల్వలో వదిలేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసును దర్యాప్తు చేయగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్ హత్యకేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హంతకుడు మనోజ్, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
Chengalpattu Express Robbery: చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. కేబుల్ కత్తిరించి..!
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!