Gadwal Murder Twist: తన భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
- తన భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు
- తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితమే పెళ్లి
- సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లలను కనాలని భావించిన తిరుమలరావు
- తేజేశ్వర్ను, తన భార్యను అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Murder Twist: గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. తాజా దర్యాప్తులో అతను తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు వెల్లడైంది. తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహమైన 8 సంవత్సరాలయినా సంతానం లేని పరిస్థితుల్లో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అతనికి వాంఛ కలిగింది. ఈ కారణంగా తన భార్యతో పాటు ఐశ్వర్య జీవితంలో అడ్డుగా ఉన్న సర్వేయర్ తేజేశ్వర్ను కూడా తొలగించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ను నియమించినట్టు తెలుస్తోంది.
Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
జూన్ 17న, నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు కలిసి ల్యాండ్ సర్వే నిమిత్తంగా కారులో తేజేశ్వర్ను తీసుకెళ్లారు. అనంతరం ప్లాన్ ప్రకారం ముందురోజే బ్యాంకు నుంచి 20 లక్షలు డ్రా చేసిన తిరుమలరావు, హత్య అనంతరం 2 లక్షల రూపాయల నగదును హంతకులకు చెల్లించాడు. తేజేశ్వర్ను కత్తితో పొడిచిన అనంతరం మృతదేహాన్ని కర్నూల్ శివారులో పడేసి, తిరుమలరావుకు చూపించారు సుపారీ గ్యాంగ్.
ఇక.. హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లడఖ్ వెళ్లాలన్న పథకం ప్రకారం, ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు కూడా తెప్పించుకుంది. పోలీసులు ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడు తిరుమలరావును పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అతను లడఖ్కు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!