Gadwal Murder Twist: తన భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
- తన భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు
- తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితమే పెళ్లి
- సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లలను కనాలని భావించిన తిరుమలరావు
- తేజేశ్వర్ను, తన భార్యను అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Murder Twist: గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. తాజా దర్యాప్తులో అతను తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు వెల్లడైంది. తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహమైన 8 సంవత్సరాలయినా సంతానం లేని పరిస్థితుల్లో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అతనికి వాంఛ కలిగింది. ఈ కారణంగా తన భార్యతో పాటు ఐశ్వర్య జీవితంలో అడ్డుగా ఉన్న సర్వేయర్ తేజేశ్వర్ను కూడా తొలగించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ను నియమించినట్టు తెలుస్తోంది.
Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
జూన్ 17న, నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు కలిసి ల్యాండ్ సర్వే నిమిత్తంగా కారులో తేజేశ్వర్ను తీసుకెళ్లారు. అనంతరం ప్లాన్ ప్రకారం ముందురోజే బ్యాంకు నుంచి 20 లక్షలు డ్రా చేసిన తిరుమలరావు, హత్య అనంతరం 2 లక్షల రూపాయల నగదును హంతకులకు చెల్లించాడు. తేజేశ్వర్ను కత్తితో పొడిచిన అనంతరం మృతదేహాన్ని కర్నూల్ శివారులో పడేసి, తిరుమలరావుకు చూపించారు సుపారీ గ్యాంగ్.
ఇక.. హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లడఖ్ వెళ్లాలన్న పథకం ప్రకారం, ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు కూడా తెప్పించుకుంది. పోలీసులు ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడు తిరుమలరావును పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అతను లడఖ్కు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!