MLA Madhavaram: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ, హైదరాబాద్లోని అత్యంత విలువైన ఐడీపీఎల్ (IDPL) భూముల వ్యవహారంపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూకట్పల్లి ప్రాంతంలోని సర్వే నంబర్ 376లో ఉన్న సుమారు 8 వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములు కబ్జాలకు గురయ్యాయన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. వాస్తవానికి, పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన ఈ ఐడీపీఎల్ భూములు కబ్జాలకు గురయ్యాయని, పలువురు రాజకీయ […]
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు…అమెరికా మరోషాక్ ఇచ్చింది. హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల…సోషల్ మీడియా ఖాతాల పరిశీలనను ప్రారంభించింది. వెట్టింగ్కు వీలుగా హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా…తమ సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు వెళ్లాలి..అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ, అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు […]
Rainbow Children’s Hospital : గోదావరి జిల్లాల ప్రజలకు సమగ్రమైన చిన్నారులు, మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే లక్ష్యంతో, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ (Rainbow Children’s Hospital), బర్త్రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్ (BirthRight by Rainbow Hospitals) రాజమహేంద్రవరంలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం డిసెంబర్ 17, 2025 నాడు ఉదయం 10:30 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజమండ్రిలోని గాంధీపురం 1, ఏవీఏ రోడ్లో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రాంగణంలో […]
మరణశిక్ష అమలులో నయా రికార్డ్ సృష్టించిన ముస్లిం దేశం.. ఈ ముస్లిం దేశం శిరచ్ఛేదం(మరణశిక్ష) అమలులో నయా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. AFP లెక్కల ప్రకారం.. ఈ దేశం ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఇది సౌదీ చరిత్రలో అత్యధికంగా విధించిన మరణశిక్ష సంఖ్య. 2024లో ఈ సంఖ్య 338 […]
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రశంసించారు. తమ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత రాష్ట్రానికి గర్వకారణమని వారు అభినందించారు. పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బాబురావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, అఖిల భారత సర్వీసు సాధించి జిల్లాకు […]
ఈ రోజు GHMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన అంశంపై చర్చ కొనసాగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల విలీనం చేసిన 27 మునిసిపాలిటీలతో పాటు, ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్పై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు మరియు నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్చల సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దారుస్సలంలో వార్డుల విభజన జరిగిందంటూ బీజేపీ కార్పోరేటర్లు […]
నా లిమిట్స్లో నువ్వు వ్యాపారం చేసుకోవాలా? అయితే కప్పం కట్టాల్సిందే, చెప్పినంత సమర్పించుకోవాల్సిందే. సొంత పార్టీ వాళ్ళయినా సరే… ఇందులో సీజనల్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ ఏమీ ఉండవంటూ కరాఖండీగా చెప్పేస్తున్నారట ఆ ఎమ్మెల్యే కమ్ ఎక్స్ మినిస్టర్. ఆయన పార్టీ మారినా పైసా వసూల్ పద్ధతి మాత్రం మారలేదట. ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? సొంతోళ్ళ దగ్గరే ఎలా గుంజుతున్నాడు? ఏపీలో కూటమి ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందోగానీ…. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. […]
Kondagattu Anjanna : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రస్తుతం అటవీ శాఖ, దేవాదాయ శాఖ (ఎండోమెంట్) మధ్య కీలక వివాదానికి కేంద్రంగా మారింది. అటవీ శాఖ అధికారులు ఆలయ నిర్వహణ కమిటీకి నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో, భక్తులలో మరియు స్థానికులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటవీ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులలో, ఆలయ నిర్వహణ కమిటీ 684 బ్లాక్ అటవీశాఖ పరిధిలోని […]
Sydney Bondi Beach : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బోండీ బీచ్ వద్ద ఆదివారం, డిసెంబర్ 14, 2025న నిర్వహించిన ప్రజా హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన భారీ కాల్పుల ఘటనలో 15 మంది అమాయక పౌరులు మృతి చెందగా, దాడి చేసిన ఇద్దరిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం , పోలీసులు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. ఈ దాడికి పాల్పడినవారిగా సజీద్ అక్బర్ (50) , అతని కుమారుడు *నవీద్ […]
చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టింది చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలో జీఎంఆర్, మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే.. అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతోందని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్రపోనివ్వరంటే.. ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. పార్టీలు.. రాజకీయాల కోసం […]