తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు […]
ఏపీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార పసుపుధార జలాశయాలు నిండుకుండాల మారాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. కుమారధార పసుపుధార, ఆకాశగంగ జలశయాల నుంచి ఓవర్ ఫ్లోలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీట మునగడంతో తిరుపతిలో కంట్రోల్ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం […]
పోలీసుల అండతో రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఘటనపై చినరాజప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఆంక్షలెందుకు పెట్టారు..? […]
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర […]
తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోటోస్ ఫ్రేమ్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్శిల్స్ చేసి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బేగంపేటలో ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ […]
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని […]
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. […]
పీఆర్సీ అమలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై చర్చించింది. అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణ కోసం ప్రభుత్వ నోడల్ అధికారిని నియమించింది. దీనికోసం ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ […]
టీఎస్ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినాటి నుంచి వినూత్న కార్యక్రమాలకు ప్రవేశపెడుతూ ఆర్టీసీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. అయితే తాజా మరో కొత్త కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టించి. ఇక నుంచి పెండ్లిలకు బస్సును బుక్ చేసుకుంటే నూతన వధూవరులకు ఆర్టీసీ తరుపున జ్ఞాపికను అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్క రోజే 500 వివాహాల్లో 500 నవ దంపతులకు ఆర్టీసీ తరుపున షీల్డ్ ను ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానం చేశారు. […]