దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్.. హైదరాబాద్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (టీఎస్ట్రాన్స్కో) ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్ స్టేషన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి చేస్తున్న విద్యుత్ నెట్వర్క్లో భాగంగా ఈ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, టీఎస్ట్రాన్స్కో, టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, ఇతర అధికారులు కొత్త సబ్ స్టేషన్ను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ వాసుల 30-40 ఏళ్ల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తోందన్నారు. గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలకు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందిస్తుందన్నారు. దీని ప్రకారం టీఎస్ట్రాన్స్కో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 400 కేవీ, 220 కేవీ, 133 కేవీ మరియు 33 కేవీ సబ్ స్టేషన్లను అభివృద్ధి చేస్తోందన ఆయన వెల్లడించారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
అధికారులు రాయదుర్గంలో ఒకే ప్రాంగణంలో 400 కేవీ, 220 కేవీ, 133 కేవీ మరియు 33 కేవీ మొత్తం నాలుగు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు 100 ఎకరాల భూమి అవసరమై ఉండగా.. మోనోపోల్స్ మరియు మూడు కిలోమీటర్ల భూగర్భ కేబుల్ నెట్వర్క్ను విస్తృతంగా ఉపయోగించి ఐదు ఎకరాల్లో ఈ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో టీఎస్ ట్రాన్స్కో విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు.
గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్-స్టేషన్లు సెమీ-ఇండోర్ మరియు తక్కువ భూమి అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి మరియు ఇతర అంతరాయాలు ఉన్నప్పటికీ, సబ్ స్టేషన్ పూర్తయిందని, అంతేకాకుండా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. 1,400 కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేశామని, హైదరాబాద్ నగరానికి మరో 2,000 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు సన్నద్ధమయ్యామని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!