దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్.. హైదరాబాద్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (టీఎస్ట్రాన్స్కో) ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్ స్టేషన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి చేస్తున్న విద్యుత్ నెట్వర్క్లో భాగంగా ఈ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, టీఎస్ట్రాన్స్కో, టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, ఇతర అధికారులు కొత్త సబ్ స్టేషన్ను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ వాసుల 30-40 ఏళ్ల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తోందన్నారు. గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలకు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందిస్తుందన్నారు. దీని ప్రకారం టీఎస్ట్రాన్స్కో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 400 కేవీ, 220 కేవీ, 133 కేవీ మరియు 33 కేవీ సబ్ స్టేషన్లను అభివృద్ధి చేస్తోందన ఆయన వెల్లడించారు.
Also Read
అధికారులు రాయదుర్గంలో ఒకే ప్రాంగణంలో 400 కేవీ, 220 కేవీ, 133 కేవీ మరియు 33 కేవీ మొత్తం నాలుగు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు 100 ఎకరాల భూమి అవసరమై ఉండగా.. మోనోపోల్స్ మరియు మూడు కిలోమీటర్ల భూగర్భ కేబుల్ నెట్వర్క్ను విస్తృతంగా ఉపయోగించి ఐదు ఎకరాల్లో ఈ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో టీఎస్ ట్రాన్స్కో విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు.
గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్-స్టేషన్లు సెమీ-ఇండోర్ మరియు తక్కువ భూమి అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి మరియు ఇతర అంతరాయాలు ఉన్నప్పటికీ, సబ్ స్టేషన్ పూర్తయిందని, అంతేకాకుండా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. 1,400 కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేశామని, హైదరాబాద్ నగరానికి మరో 2,000 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు సన్నద్ధమయ్యామని చెప్పారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..