ప్రజల్లోకి వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మరో అడుగు వేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే పలు విధాల కార్యక్రమాలతో ఆర్టీసీని అందుబాటులోకి తీసువచ్చారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందు నిర్వారామంగా కృషి చేస్తున్నారు. నిత్యం ట్విట్టర్ స్పందిస్తూ.. ప్రయాణికుల సమస్యలే కాకుండా.. ఆర్టీసీ ఉద్యోగల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. అయితే తాజాగా టీఎస్ఆర్టీసీలో ప్రయాణిస్తే […]
బైజూస్ యాజమాన్యంలోని ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫారమ్ వైట్హాట్ జూనియర్ (WhiteHat Jr) 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,690 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో రూ. 484 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించింది. రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్ (ROC)కి దాఖలు చేసిన వార్షిక ఆర్థిక నివేదికలలో కంపెనీ బ్యాలెన్స్ షీట్ 2021ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయాలు రూ. 483.9 కోట్లుగా ఉంది. అలాగే 2020 అర్థిక సంవత్సరంలో రూ. 19 కోట్లుగా ఉంది. […]
మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హనుమాన్ జయంతి వేడుకలకు హాజరుకాలేకపోయిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించారు. అంజన్న సన్నిధిలో దీక్ష విరమించడానికి చిన్న హనుమాన్ జయంతి పవిత్రమైన రోజు అని బలంగా నమ్ముతున్నందున హనుమాన్ దీక్షను తీసుకున్న భక్తులు కొండగట్టు ఆలయంలో దీక్ష విరమించారు. అంజనేయ స్వామి దీక్షదారులతో కొండగట్టు […]
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే వారంతంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వారాంతంలో తిరుపతికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) […]
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ […]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను […]
గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’. ‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక […]
తెలంగాణ రాష్ట్రంలో నిన్న పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. దీంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ.. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, ఉత్తర కుమార ప్రగల్బాలు టీఆర్ఎస్ నేతలు పలికారని ఆయన ఆరోపించారు. దేశానికే దిక్సూచి అని చెప్పారని, రైతులకు 3 గంటలు, 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనధికారికంగా అధికారులకు మౌఖిక […]
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ, మెడ్-టెక్ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన హైదరాబాద్లో రెడీ అయ్యిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సూల్తాన్పూర్లో సిద్ధమైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ పార్కుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజ్ పార్కుని 302 ఏకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రాంగణంలో ఇప్పటికే అనేక కంపెనీలు […]
కరోనా మహమ్మారి మలేషియా దేశంలో విలయ తాండవం చేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నాటికి మలేషియాలో 10,413 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు కోవిడ్ బాధితుల సంఖ్యం 43,63,024కు చేరుకుంది. అయితే వీటిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉండగా, స్వదేశంలో 10,386 మందికి ఈ కరోనా సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ […]