కోవిడ్ -19 ఫస్ట్ వేవ్ సమయంలో ఆకస్మిక లాక్డౌన్ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వేలాది మంది వలస కార్మికులను క్లిష్టమైన కోవిడ్ పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం గాలికి వదిలివేసిందని ఆరోపించారు. కవిత తన ట్విట్టర్ హ్యాండిల్లో “కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించింది. ఇది మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, గందరగోళానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని వలస కార్మికుల కష్టాలను కేసీఆర్ అర్థం చేసుకుని వారికి అండగా […]
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్లో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మోడీ దేశానికి ఏం చేశాం అనేది చెప్పకుండా నెహ్రూ మీద మాట్లాడారని, మోడీ మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుందని ఆయన విమర్శించారు. మోడీ ప్రధాని లాగా కాకుండా.. […]
సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి తలసానికి వినతిపత్రం సమర్పించామని సినీ నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ అన్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి సమస్యల గురించి చర్చించారని ఆయన అన్నారు. ఆన్లైన్ బుకింగ్ తెస్తామని రెండు ప్రభుత్వాలు చెప్పాయని, బుక్ మై షో వాళ్ళు టికెట్పై 15 నుంచి 25 రూపాయల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు. […]
పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించాలని టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయంగా ఏమి ఉందో బీజేపీ వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో చాలా బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, జీ రంజిత్రెడ్డి తదితరులతో కలిసి న్యూఢిల్లీలో […]
చింతామణి నాటకం నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీజే ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. అయితే ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 200 ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తారా, విచారణను సాగదీసేందుకే […]
317 జీవోను సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్దం కావాలని పిలుపునిస్తూ రూపొందించిన కరపత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇగ ఎట్లాంటి సమస్యలుండవ్… పిల్లలకు మంచిగ పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నా హ్రుదయ పూర్వక నమస్సులు తెలిపారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలగాణ సాధించుకున్నమో అదే […]
సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో, సుడా మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. 2041వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని 20 సంవత్సరాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గతంలో 3.15 చదరపు కిలోమీటర్లు ఉన్న సుడా పరిధి నేడు 310 చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతున్నామని ఆయన వెల్లడించారు. సమగ్రమైన […]
ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి శ్రీరామానుజ సాహస్రాబ్ది వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 నుంచి చిన జీయర్ స్వామితో నాకు అనుబంధం ఉందని ఆయన తెలిపారు. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు చిన జీయర్ స్వామి అక్కడ సేవ కార్యక్రమలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సమాత మూర్తి విగ్రహ సమాత మూర్తి కేంద్రంను దేశం గుర్తు పెట్టుకుంటుంది.. అందరూ గుర్తు పెట్టుకుంటారని ఆయన అభిప్రాయం […]
రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఈరోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరం, ఆక్షేపణీయమని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోడీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణపై బీజేపీకి మోడీకి ఎందుకంత […]
ఈ నెల 12వ తేదీన భువనగిరిలో జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశo నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే, భాస్కర్ రావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. ఎదో రాజకీయ నాయకుడిలాగా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు తెచ్చే అలవాటు కేసీఆర్ కు […]