Canal Construction : రైతు కుటుంబాల్లో కాలువ కార్చిచ్చు..
ఉన్న భూమిలో సగం ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట తీసుకొని నష్టపరిహారం చెల్లించకుండా తిప్పుకోవడం.. ఎప్పటికో నష్టపరిహారం వచ్చింద కదా అనుకుంటుంటే.. మళ్లీ మిగిలిన భూమిని కూడా ప్రభుత్వాలు తీసుకునేందుకు అడుగులు వేయడంతో రైతుల కుటుంబాలు భరించలేక ఆత్మహత్యలు చేసుంటున్నారు. మరికొందరు భూమి పోతుందన్న బాధను దిగమింగలేక గుండెఆగి చనిపోతున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రామగుడు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో అదనపు కాలువ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఈ కాలువ అవసరం లేదని అక్కడి రైతులు, ప్రజలు నిరసనకు దిగారు.
అయినప్పటికీ ప్రభుత్వ తన నిర్ణయం మార్చుకోలేదు. దీంతో రాధమ్మ అనే మహిళ రైతు పొలంలోనే కుప్పకూలి మరణించింది. అదనపు కాలువలో పూర్తి భూమిని రాధమ్మ కుటుంబం కోల్పోతోంది. గతంలో వరద కాలువలో భూమిని కోల్పోయి, మరోసారి భూమి కోల్పోవలసి రావటంతో ఆవేదనతో రాదమ్మ మృతి చెందినట్లు కుంటుంబీకులు వెల్లడించారు. పొలం దగ్గర తిరుగుతూ పొలంలోనే రాధమ్మ పడిపోయింది. ఇదే గ్రామంలో 15 రోజుల క్రితం రైతు రాఘవ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?