సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ సీఎం అయ్యాడని, దళితుల, బీసీల, మైనారిటీల సంక్షేమం కోసం మార్చాలి అంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, సీఎం చేసిన వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఏప్రిల్ 9న నిరసనకు అనుమతి […]
హనుమకొండ జిల్లాలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో మా మహిళ మంత్రి కనబడ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. మా జిల్లా మంత్రులు కనిపించలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికల్లో మా మంత్రుల పేర్లు ఎందుకు పెట్టలేదని, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని […]
ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. అవకతవకలు, ఆలస్యంగా రైతులకు చెల్లింపులపై కేంద్రం విచారణ చేపట్టాలన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ వరి ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ధృవీకరించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాలని కోరినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలే […]
Nizamabad MLC Kalvakuntla Kavitha Says Ugadi Wishes to Telangana People. తెలంగాణ ప్రజలకు నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో ఉన్న తీపి, పులుపు, ఒగరులా జీవితంలో కూడా సుఖదుఃఖాల ఉంటాయన్నారు. ఈ ఉగాది ప్రతి వారి జీవితంలో మరింత శుభాన్ని కలిగించాలని ఆమె కోరారు. అంతేకాకుండా తెలుగువారందరికీ ఇది శ్రీశుభకృత్ నామసంవత్సరాది అయితే.. తెలంగాణ యువతకు మాత్రం […]
హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్ కంపెనీ డ్రిల్ మెక్ అడుగుపెట్టనుంది. డ్రిల్ మెక్ రూ. 300 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. ఇంధనంగా హైడ్రోజన్ భవిష్యత్తు ప్రత్యామ్నాయంగా మారనున్న నేపథ్యంలో ఇడ్రోజెన స్టార్ట్ అప్ను డ్రిల్ మెక్ ప్రారంభించనుంది. హైడ్రోజన్ ఉత్పత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఫైరోలిటిక్ కన్వర్టర్ డ్రిల్ మెక్ తయారు చేసింది. ఈ టెక్నాలజీతో హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ సులభతరం కానుంది. హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు జియోధర్మల్ ఎనర్జీ ను సైతం డ్రిల్ మెక్ […]
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణ ప్రజలను అవమనపరిచేలా ఇవాళ మాట్లాడారని మంత్రి హరీష్రావు తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ కు వక్రీకరణలు అలవాటుగా మారిందని, పీయూష్ గోయల్ కు అర్థం కావడం లేదు…వ్యవసాయం చేస్తే రైతు సమస్యలు ఏమిటో ఆయనకు తెలిసేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని, తెలంగాణ రైతుల సమస్యను పీయూష్ గోయల్ అర్థం కావడం […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ధాన్యాన్ని పంది కొక్కుల లెక్క బుక్కారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్లో రైస్ మిల్లర్లతో కవిత కుమ్మక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ధాన్యం కొనుగోలు పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కోట్లు వసూలు చేసింది కవిత అని, ఆ డబ్బులు ఏమయ్యాయి చెప్పు […]
Congress Leader Madhu Yashki Goud Fired on Minister KTR. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు నువ్వానేనా.. అనే విధంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారిందన్నారు. తమ్మీ తారక రామారావు… 50 యెండ్లలో ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నావు.. కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్ నీ హబ్ గా చేసింది […]
ఏపీ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు ఇటీవల సీఎం జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశవాహులు మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ వర్గాల పై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్త క్యాబినెట్లో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత పెరుగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బీసీ మంత్రుల కీలక సమావేశం నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ బీసీ మంత్రులు […]
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిని అభివృద్ధి చేస్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా జేసీ సోదరులు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపత్రికి ఎక్కువ నిధులు కేటాయించారని, అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామన్నారు. అభివృద్ధి జరుగుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేసీ […]