Today (05-01-23) Business Headlines: డార్విన్ బాక్స్కి రూ.40.5 కోట్లు: మానవ వనరుల సేవలు అందించే హైదరాబాద్ స్టార్టప్ డార్విన్ బాక్స్ తాజాగా దాదాపు 40 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించింది. సిరీస్ డీ ఫండ్ రైజ్లో భాగంగా వీటిని సేకరించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫండ్స్ను సమకూర్చింది. ఏడేళ్ల కిందట స్థాపించిన డార్విన్ బాక్స్ ఇటీవలే యూనికార్న్ హోదా పొందిన సంగతి తెలిసిందే.
Today (04-01-23) Stock Market Roundup: కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ తొలిసారి నష్టాలతో ముగిసింది. ఈ రోజు బుధవారం ఉదయం రెండు సూచీలు కూడా అతి స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమై భారీ లాసులతో క్లోజ్ అయ్యాయి. ఇంట్రాడేలో టుడే లోయెస్ట్ వ్యాల్యూస్కి పడిపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గింది. ఫలితంగా సెన్సెక్స్ 60 వేల 633 పాయింట్లకు, నిఫ్టీ 18 వేల 037 పాయింట్లకు దిగొచ్చాయి.
Upcoming Electric Cars in 2023: కొత్త సంవత్సరంలో.. కొత్త విద్యుత్ కార్ల లాంఛింగ్లతో.. ఆటోమొబైల్ రంగం అద్దిరిపోనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టాటా మోటార్స్, మహింద్రా, ఎంజీ తదితర సంస్థలు 2023లో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ఇండియాలో ఇంధన ధరలు పెరగటం మరియు ఎలక్ట్రిక్ వెహికిల్స్కి ప్రోత్సాహం కోసం ప్రభుత్వం సబ్సిడీలను ఆఫర్ చేస్తుండటంతో ఈవీ సెక్టార్కి బూస్ట్ లాంటి సానుకూల వాతావరణం నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.
OnePlus-11(5G) to launch in India: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’.. సరికొత్త మోడల్ సెల్ఫోన్ను స్వదేశంలో జనవరి 4వ తేదీన.. అంటే.. బుధవారం నాడు లాంఛ్ చేయబోతోంది. ఇండియాలో మాత్రం నెల రోజులు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ లెవెన్ సిరీస్లో 5జీ టెక్నాలజీతో రూపొందించిన ఈ అప్డేటెడ్ మొబైల్ ఫోన్ను ఫిబ్రవరి 7వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న క్లౌడ్-11 ఈవెంట్లో ఆవిష్కరించనుంది.
Today (04-01-23) Business Headlines: హైదరాబాద్ టు కాకినాడ: హైదరాబాద్కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్.. ఏపీలోని కాకినాడలో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటుచేయనుంది. ఔషధాల తయారీకి కావాల్సిన ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’, ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రెడియంట్స్ మరియు ఫెర్మెంటేషన్ ప్రొడక్టుల కోసమే ఈ కొత్త ప్లాంట్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.
Today (03-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం మాదిరిగానే ఇవాళ మంగళవారం కూడా నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. ముఖ్యమైన రెండు సూచీలు కూడా ఊగిసలాట ధోరణ ప్రదర్శించాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బయ్యర్లను ఆకర్షించగా రిలయెన్స్ మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 50 పాయింట్లు పెరిగి 61 వేల 200 వద్దకు చేరింది.
RBI Governor on CryptoCurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
Indian Box Office Report: 2022లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు 10 వేల కోట్ల రూపాయల మార్క్ను చేరుకున్నాయి. నవంబర్కు సంబంధించిన ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెలలో.. హిందీలో వచ్చిన దృశ్యం-2 మూవీ అన్ని భాషల చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ ఒక్క పిక్చర్ మాత్రమే నవంబర్లో వంద కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ను క్రాస్ చేయటం విశేషం.
Today (03-01-23) Business Headlines: పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ: బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది.
Today (02-01-22) Stock Market Roundup: నూతన సంవత్సరం 2023లో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్ నిర్వహించింది. అయితే.. ఈ కొత్త ఏడాదిలో శుభారంభం లభించలేదు. ఇవాళ ఉదయం రెండు సూచీలు కూడా నష్టాలతోనే ప్రారంభమై ఇంట్రడేలో ఫ్లాట్గా కొనసాగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, ఐటీ, ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగాల్లో షేర్ల అమ్మకాలు జరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. మెటల్ సెక్టార్ స్టాక్స్ ససోర్ట్తో ఎట్టకేలకు పుంజుకొని లాభాల్లో ముగిశాయి.