Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.
Jobs Market-2023: ఇండియన్ జాబ్ మార్కెట్లో కొత్త సంవత్సరం నియామకాల జోరు నెలకొననుంది. ముఖ్యంగా స్పెషలైజ్డ్ ఐటీ, టెలికం అండ్ సేవల ఆధారిత రంగాలు ఈ రిక్రూట్మెంట్లలో జోష్ నింపనున్నాయి. రిటైల్, ఇ-కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల హైరింగ్లో పండుగ సీజన్ ఉత్సాహం ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. ఆతిథ్యం మరియు ఎయిర్లైన్ సెక్టార్లలో సైతం ఇదే ట్రెండ్ కంటిన్యూ కానుంది.
Today (31-12-22) Business Headlines: తెలంగాణ వ్యక్తికి కీలక పదవి: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా విద్యుత్ను సరఫరా చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న NLC ఇండియా అనే సంస్థకు తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను నియమించారు. ఈ కీలక పదవి తెలంగాణకు చెందిన కలసాని మోహన్రెడ్డికి దక్కటం విశేషం. ఈయన ఇప్పుడు ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ ప్లానింగ్ విభాగానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
Today (30-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ ఈ ఏడాది చిట్టచివరి ట్రేడింగ్ సెషన్ జరిగింది. రేపు శనివారం స్టాక్ మార్కెట్కి సెలవు కావటంతో ఈ రోజు శుక్రవారమే 2022కి లాస్ట్ ట్రేడిండ్ డే అయింది. ఇవాళ రెండు సూచీలు కూడా ఫ్లాట్గా కొనసాగాయి. కొద్దిసేపు లాభాల్లోకి.. మరికొద్దిసేపు నష్టాల్లోకి జారుకుంటూ ఊగిసలాట ప్రదర్శించాయి. ఉదయం లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ చివరికి నష్టాల్లో ముగిశాయి.
Reliance-Metro Deal: రిలయెన్స్ రిటైల్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీని పూర్తిగా అక్వైర్ చేసుకుంటోంది. దీంతో బిజినెస్పరంగా రిలయెన్స్ పంట పండినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెట్రోను కొనుగోలు చేయటం ద్వారా రిలయెన్స్ రిటైల్కి ఒకేసారి ఏకంగా 30 లక్షల మంది వినియోగదారులు పెరగనున్నారు. ఇందులో కనీసం 10 లక్షల మంది రెగ్యులర్ కస్టమర్లు కావటం విశేషం. ఫలితంగా రిలయెన్స్ రిటైల్ వ్యాపారం భారీగా ఊపందుకోనుంది.
IPL Cricket: ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. కానీ.. ఐపీఎల్ని ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్ అని సైతం అభివర్ణించొచ్చు. మన దేశంలోని అత్యంత విజయవంతమైన, అత్యధిక లాభదాయకమైన నవతరం స్టార్టప్లలో ఒకటిగా ఐపీఎల్ ఇప్పటికే తననుతాను నిరూపించుకుంది. బిజినెస్ విషయంలో.. విలువ పరంగా.. ఐపీఎల్.. యూనికార్న్ లెవల్ నుంచి డెకాకార్న్ స్థాయికి ఎదిగింది. ఈ క్రికెట్ లీగ్ వ్యాల్యూని డీ అండ్ పీ అడ్వైజరీ అనే కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది.
Today (30-12-22) Business Headlines: ‘హైదరాబాద్ చాక్లెట్’ కొన్న రిలయెన్స్: సీనియర్ మోస్ట్ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్ నంబియార్ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటల్ చాక్లెట్ కంపెనీని.. రిలయెన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్ కంపెనీ ప్రస్తుతం సింగపూర్ సంస్థ సన్షైన్ అలైడ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుబంధంగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.
Today (29-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఇవాళ కోలుకుంది. నిన్న బుధవారం నష్టాల్లో ముగిసిన రెండు సూచీలు ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. కానీ మధ్యాహ్నం తర్వాత లాభాల బాటలోకి వచ్చి చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఎర్లీ ట్రేడింగ్లో గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో వరుసగా రెండో రోజు కూడా బిజినెస్ లాస్లోనే నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Today (29-12-22) Business Headlines: ఐఓసీ విస్తరణ ప్రణాళిక: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న మరియు అమలుచేయనున్న విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఏర్పాటుచేస్తున్న ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని హైదరాబాద్కు దగ్గరలో మల్కాపూర్ వద్ద టెర్మినల్ నిర్మాణం 87 శాతం పూర్తయింది.
Today (28-12-22) Stock Market Roundup: ఈ వారంలో వరుసగా రెండు రోజులు.. సోమవారం.. మంగళవారం.. లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం ఊగిసలాట ధోరణి ప్రదర్శించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో ప్రారంభమై చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. ఎర్లీ ట్రేడింగ్లో సెన్సెక్స్ 60 వేల 714 పాయింట్లకు పడిపోయింది.