Today (04-01-23) Business Headlines: సినిమాహాల్ ఓనర్ల ఇష్టం. బయటి ఫుడ్ నిషేధం ‘రైటే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (04-01-23) Business Headlines:
హైదరాబాద్ టు కాకినాడ
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
హైదరాబాద్కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్.. ఏపీలోని కాకినాడలో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటుచేయనుంది. ఔషధాల తయారీకి కావాల్సిన ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’, ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రెడియంట్స్ మరియు ఫెర్మెంటేషన్ ప్రొడక్టుల కోసమే ఈ కొత్త ప్లాంట్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వచ్చే ఐదు సంవత్సరాల్లో 2 వేల కోట్ల రూపాయలను దశల వారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ పరిశ్రమను సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్నారు.
హైదరాబాదులో ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్’
మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల దాదాపు మూడేళ్ల అనంతరం ఇండియాకి వచ్చారు. నిన్న మంగళవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్ కూడా రానున్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసైన అజూర్కి నాలుగో రీజియన్ని భాగ్యనగరంలో యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటైజేషన్ ప్రక్రియ ఇండియాలో చాలా బాగా జరుగుతోందని మెచ్చుకున్నారు. మరో మూడేళ్లలో అన్ని అప్లికేషన్లూ క్లౌడ్ బేస్డ్గానే రూపొందుతాయని సత్య నాదెళ్ల తెలిపారు.
రు.1.6 లక్షల కోట్లకు రెవెన్యూ
2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఆదాయం ఒకటీ పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఈ రంగంలో 12 శాతం నుంచి 14 శాతం వరకు గ్రోత్ రేట్ నెలకొంటుందని అంచనా వేసింది. ఆదాయంలో 55 శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో వస్తుందని, మిగతా 45 శాతం సబ్స్క్రిప్షన్ల ద్వారా వస్తుందని తెలిపింది. అడ్వర్టైజ్మెంట్ల రూపంలో వచ్చే రెవెన్యూలో ఫస్ట్ ప్లేస్ డిజిటల్ ప్లాట్ఫామ్లదేనని, ఆ తర్వాత స్థానాల్లో టీవీ మరియు ప్రింట్ మీడియాలు ఉన్నాయని క్రిసిల్ వివరించింది.
‘ఆల్-టైమ్ లో లెవల్’కి రూపాయి
డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ నిన్న మంగళవారం ఆల్టైమ్ లో లెవల్కి పడిపోయింది. 22 పైసలు పతనమై 83 రూపాయల వద్ద ముగిసింది. డాలర్ బలపడిన కారణంగా ఫారన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా మార్కెట్ నుంచి వెళ్లిపోయాయి. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రారంభ లాభాలను కోల్పోయింది. మార్నింగ్ సెషన్లో 82 పాయింట్ ఆరు తొమ్మిది రూపాయల వద్ద ప్రారంభమైన మారకం విలువ ఇంట్రాడేలో నేలచూపులు చూసింది. 2021 అక్టోబర్ 19 తర్వాత ఇంత తక్కువ విలువ నమోదవటం ఇదే తొలిసారి.
25 నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు
దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్లైన్స్ సేవలు హైదరాబాద్ నుంచి ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి గోవా మరియు బెంగళూరులకు ఇంకో రెండు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రోజువారీ సేవలకు శ్రీకారం చుట్టనుంది. బిజినెస్ మరియు టూరిజం ప్యాసింజర్లను దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసులను ఆరంభిస్తోంది. ఈ విషయాలను ఆకాశ ఎయిర్ కోఫౌండర్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు.
సినిమాహాల్ ఓనర్ల ఇష్టం
ప్రేక్షకులు బయటి నుంచి ఫుడ్ మరియు బేవరేజెస్ తెచ్చుకోకుండా నిషేధించే అధికారం సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా థియేటర్లనేవి వాటి యజమానుల ప్రైవేట్ ప్రాపర్టీ అని, అందువల్ల ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావొద్దు అని నిర్ణయించే అధికారం వాళ్లకు ఉంటుందని పేర్కొంది. మల్టీప్లెక్స్ మరియు సినిమా హాళ్లలోకి విజిటర్లు బయటి నుంచి ఫుడ్ అండ్ బేవరేజెస్ తెచ్చుకోకుండా నిషేధించొద్దంటూ జమ్మూకాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!