Gautam Gambhir: టీమ్ ఇండియా, గౌతమ్ గంభీర్కు 2025 సంవత్సరం కలసిరాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ ఆసియా కప్ (టీ20లు), ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) గెలిచింది. మరోవైపు టెస్టు క్రికెట్లో మాత్రం భారీ పరాజయాలను ఎదుర్కొంది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ల్లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా భారత్ను స్వదేశంలోనే 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 2024లో గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే భారత్ న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో 3-0తో ఓడిపోయింది. READ […]
Pakistan: టీ20 వరల్డ్ కప్కు ముందు పాకిస్థాన్కు భారీ దెబ్బ తగిలింది. బిగ్ బాష్ లీగ్లో ఆడుతున్న సమయంలో షాహీన్ అఫ్రిదీ గాయంతో మైదానం విడిచిపెట్టాడు. డిసెంబర్ 15న బిగ్ బాష్ లీగ్లో తన కెరీర్ను పునఃప్రారంభించిన రోజే షాహీన్ అఫ్రిదికి కలిసి రాలేదు. సైమండ్స్ స్టేడియంలో మెల్బోర్న్ రెనిగేడ్స్తో జరిగిన మ్యాచ్లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడిన అఫ్రిదీ ప్రమాదకర బౌలింగ్ కారణంగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో అఫ్రిదీ వేసిన రెండు బంతులు నడుము ఎత్తులో ఫుల్టాస్గా వెళ్లాయి. ఒకటి…
ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్ మేకర్ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా? వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా […]
Car Prices Increase: కొత్త ఏడాదిలో కార్లు ధరలు పెరగనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన వాహనాల ధరలను 2026 జనవరి నుంచి గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్ను బట్టి భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఆటోమొబైల్ రంగంలో కొనసాగుతున్న ఆర్థిక సవాళ్లే ఈ నిర్ణయానికి కారణమని వివరించింది. భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించడంపై తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో పోటీని…
Pakistan: పాకిస్థాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలస (టాలెంట్ ఎగ్జోడస్)ను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కేవలం రెండేళ్లలోనే వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని బయటపెట్టింది. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది.
Chicken or Egg Question: "కోడి ముందా? గుడ్డు ముందా..?" అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా మనుషుల్ని గందరగోళంలో పడేస్తోంది. పండితుల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు దీనికి సమాధానం దొరికిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం.. ఈ రోజు మనకు కనిపించే పక్షులు, సరీసృపాల పురాతన పూర్వీకులు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను ప్రసవించి ఉండవచ్చని ‘ది టైమ్స్’ నివేదించింది. ఈ పరిశోధన వివరాలు ‘నేచర్…
Silver Prices: వెండి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 2015లో రూ.50,000 పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది. ఈ పదేళ్లలో వెండి నాలుగు రెట్లు పెరిగింది. 2015 డిసెంబర్ 28న కిలో వెండి ధర రూ.33,360గా ఉండగా, 2025 డిసెంబర్ 26 నాటికి అది రూ.2,28,948కు చేరింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని వెండి, ఈ దశాబ్దంలో అత్యధిక సంపద సృష్టించిన ఆస్తులలో ఒకటిగా మారింది.
Top 5 Most Impactful Cars Launched in India in 2025: 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కీలకమైన కొత్త కార్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది కంపెనీలు పూర్తిగా కొత్త మోడళ్లను తీసుకురావడమే కాకుండా, పాత పేర్లను మళ్లీ మార్కెట్లోకి తెచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మెరుగైన పెట్రోల్, డీజిల్ కార్ల వరకు అన్ని విభాగాలను ఇవి కవర్ చేశాయి. వాటిలో ఈ ఏడాది ప్రభావం చూపిన ఐదు ముఖ్యమైన కార్ల గురించి తెలుసుకుందాం..
Bangladesh: బంగ్లాదేశ్లోని ఫరీద్పూర్లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోత్సవం అర్ధరాత్రి కల్లోలంగా మారింది. శుక్రవారం రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. ‘నగర్ బౌల్’గా ప్రసిద్ధి చెందిన జేమ్స్ బంగ్లాదేశ్లోనే అతి పెద్ద రాక్ స్టార్గా గుర్తింపు పొందారు. ఫరీద్పూర్ జిల్లా స్కూల్ 185వ…
Tata Motors: భారత్లో అధికారిక లాంచ్కు ముందే హారియర్, సఫారి ఎస్యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లలో కంపెనీ కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించింది. దీనికి ‘హైపీరియన్’ అనే పేరు పెట్టారు. ఇదే ఇంజిన్ను ఇటీవల ఆల్-న్యూ సియెర్రా మోడల్తో పరిచయం చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని నాట్రాక్స్ (NATRAX) టెస్ట్ ట్రాక్లో హారియర్, సఫారి ఎస్యూవీలను పరీక్షించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో వాస్తవ రోడ్ పరిస్థితుల్లో…