Silver Prices: కాసుల వర్షం.. పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వెండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Prices: వెండి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 2015లో రూ.50,000 పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది. ఈ పదేళ్లలో వెండి నాలుగు రెట్లు పెరిగింది. 2015 డిసెంబర్ 28న కిలో వెండి ధర రూ.33,360గా ఉండగా, 2025 డిసెంబర్ 26 నాటికి అది రూ.2,28,948కు చేరింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని వెండి, ఈ దశాబ్దంలో అత్యధిక సంపద సృష్టించిన ఆస్తులలో ఒకటిగా మారింది.
READ MORE: Pakistan Nuclear: భారత్ చెప్పిందే నిజం.. పాకిస్తాన్ అణు లీకేజీపై అమెరికా- రష్యా ఆందోళన
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
ప్రస్తుతం న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రకారం.. వెండి ధర ఔన్సుకు సుమారు 78.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఇప్పటివరకు వచ్చిన గరిష్ట స్థాయి ఇదే. గత ఏడాదిలోనే వెండి ధరలు 146 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 2025 ఏడాది 1979 తర్వాత వెండికి అత్యుత్తమ సంవత్సరంగా మారే అవకాశముంది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఈ భారీ పెరుగుదలకు పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి ఎక్కువ కావడం, నిల్వలు తగ్గడం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కారణాలుగా ఉన్నాయి. వెనిజువేలా చమురు సరఫరాపై అమెరికా ఆంక్షలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, నైజీరియాలో ఐసిస్పై అమెరికా దాడులు వంటి ఘటనలు భద్ర పెట్టుబడులపై ఆసక్తిని మరింత పెంచాయి. అలాగే ద్రవ్యోల్బణం తగ్గడం, ఉద్యోగ విపణి బలహీనపడటం నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
READ MORE: Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
అయితే విశ్లేషకులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. వెండి ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, అంతే వేగంగా తగ్గే అవకాశం కూడా ఉంది. ETFలలో పెట్టుబడులు తగ్గితే 28 నుంచి 30 శాతం వరకు కరెక్షన్ రావచ్చని కేడియా అడ్వైజరీ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ 2026లో మరో 20 నుంచి 25 శాతం వరకు పెరుగుదల అవకాశముందని వారు భావిస్తున్నారు. MCXలో వెండి ధరలు రూ.2,45,000 నుంచి రూ.2,50,000 వరకు, అంతర్జాతీయంగా ఔన్సుకు 72.5 నుంచి 74 డాలర్ల వరకు వెళ్లవచ్చని అంచనా. భవిష్యత్తులో వెండికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శుభ్రమైన ఇంధనం, సౌర విద్యుత్, డేటా సెంటర్లు, విద్యుతీకరణ వంటి రంగాల్లో వెండి వినియోగం పెరుగుతోంది. బంగారం, వెండి రెండూ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో సమతుల్యత తీసుకురావడానికి ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..