Silver Prices: కాసుల వర్షం.. పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వెండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Prices: వెండి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 2015లో రూ.50,000 పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది. ఈ పదేళ్లలో వెండి నాలుగు రెట్లు పెరిగింది. 2015 డిసెంబర్ 28న కిలో వెండి ధర రూ.33,360గా ఉండగా, 2025 డిసెంబర్ 26 నాటికి అది రూ.2,28,948కు చేరింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని వెండి, ఈ దశాబ్దంలో అత్యధిక సంపద సృష్టించిన ఆస్తులలో ఒకటిగా మారింది.
READ MORE: Pakistan Nuclear: భారత్ చెప్పిందే నిజం.. పాకిస్తాన్ అణు లీకేజీపై అమెరికా- రష్యా ఆందోళన
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
ప్రస్తుతం న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రకారం.. వెండి ధర ఔన్సుకు సుమారు 78.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఇప్పటివరకు వచ్చిన గరిష్ట స్థాయి ఇదే. గత ఏడాదిలోనే వెండి ధరలు 146 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 2025 ఏడాది 1979 తర్వాత వెండికి అత్యుత్తమ సంవత్సరంగా మారే అవకాశముంది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఈ భారీ పెరుగుదలకు పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి ఎక్కువ కావడం, నిల్వలు తగ్గడం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కారణాలుగా ఉన్నాయి. వెనిజువేలా చమురు సరఫరాపై అమెరికా ఆంక్షలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, నైజీరియాలో ఐసిస్పై అమెరికా దాడులు వంటి ఘటనలు భద్ర పెట్టుబడులపై ఆసక్తిని మరింత పెంచాయి. అలాగే ద్రవ్యోల్బణం తగ్గడం, ఉద్యోగ విపణి బలహీనపడటం నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
READ MORE: Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
అయితే విశ్లేషకులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. వెండి ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, అంతే వేగంగా తగ్గే అవకాశం కూడా ఉంది. ETFలలో పెట్టుబడులు తగ్గితే 28 నుంచి 30 శాతం వరకు కరెక్షన్ రావచ్చని కేడియా అడ్వైజరీ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ 2026లో మరో 20 నుంచి 25 శాతం వరకు పెరుగుదల అవకాశముందని వారు భావిస్తున్నారు. MCXలో వెండి ధరలు రూ.2,45,000 నుంచి రూ.2,50,000 వరకు, అంతర్జాతీయంగా ఔన్సుకు 72.5 నుంచి 74 డాలర్ల వరకు వెళ్లవచ్చని అంచనా. భవిష్యత్తులో వెండికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శుభ్రమైన ఇంధనం, సౌర విద్యుత్, డేటా సెంటర్లు, విద్యుతీకరణ వంటి రంగాల్లో వెండి వినియోగం పెరుగుతోంది. బంగారం, వెండి రెండూ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో సమతుల్యత తీసుకురావడానికి ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!