Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోనేరు వద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల శీలం శ్రీనివాస్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని అరెస్టు వివరాలు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఎస్పీ వివరాల ప్రకారం.. ఇంటివద్ద పంట కాలువ స్థలం విషయంలో ఆలయ పూజారితో నిందితుడికి వివాదం తలెత్తింది.
Hyundai Creta Sales 2025: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మిడ్-సైజ్ SUV విభాగంలో కొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఏడాదిలో దాదాపు 2 లక్షల యూనిట్ల హ్యుందాయ్ క్రేటాలను విక్రయించింది. ఇది ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లో ఏ SUV సాధించని అత్యధిక వార్షిక అమ్మకాల జాబితాలో చేరింది. అంటే రోజుకు సగటున 550 క్రెటా కార్లు, గంటకు సుమారు 23 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో క్రెటా తన సెగ్మెంట్లో 34 శాతం కంటే ఎక్కువ మార్కెట్ షేర్ను నిలబెట్టుకుంది. 2020 నుంచి…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూర్ మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్కు అప్గ్రేడ్ చేశారు. గడచిన రెండేళ్లలో కదిరి మున్సిపాలిటీ సాధించిన ఆదాయం, చేసిన వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ హోదా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Electric Vehicles: భవిష్యత్తులో ట్రాఫిక్ శబ్దం తగ్గనుంది. మృదువైన ఎలక్ట్రిక్ శబ్దమే ఎక్కువగా వినిపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పెట్రోల్ బంకుల స్థానంలో చార్జింగ్ స్టేషన్లు కనిపించవచ్చు. నగరాల్లో గాలి నాణ్యత పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ మార్చడం, ఎగ్జాస్ట్ రిపేర్లు చేయడం వంటి పనులు పాతకాలపు అలవాట్లుగా మారనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) కార్లు ఒక్కసారిగా మాయమవ్వవు కానీ, వాడకం నెమ్మదిగా తగ్గిపోయి చరిత్ర పుస్తకాలలోకి వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్తు తరాలు క్లచ్ లేదా మాన్యువల్ గేర్ మార్చడం నేర్చుకోవాల్సిన…
Minister Komatireddy Venkat Reddy: హైదరాబాద్ - విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.…
DGP Shivadhar Reddy ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ తగ్గిందని.. మరోవైపు నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని తెలంగాణ డీజీపీ శిశధర్ రెడ్డి తెలిపారు.. ఏడాది పూర్తవ్వడంతో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు పంచుకున్నారు. వరకట్న కోసం మహిళల హత్యలు బాగా తగ్గాయని స్పష్టం చేశారు. వరకట్న వేధింపుల కేసులు 2 శాతం తగ్గాయి.. షీటీమ్లు చాలా యాక్టివ్గా పని చేస్తున్నాయని తెలిపారు.. ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గాయి.. సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ 23 శాతం…
AI Videos: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్కు చెందినది. అది మానవ కల్పిత కంటెంట్కు చెందినది కాదు.. ఏఐ జనరేటెడ్ వీడియోలకు చెందిన యూట్యూబ్ ఛానెల్ "బందర్ అప్నా దోస్త్" వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ కాప్వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయనం ప్రకారం.. భారతీయ ప్రేక్షకులు ఏఐ ఆధారిత కంటెంట్ను విపరీతంగా వీక్షిస్తున్నారని తేలింది. యూట్యూబ్లో ఏఐ వీడియోల పెరుగుదలపై విస్తృత చర్చ కూడా జరుగుతోంది. మానవ కంటెంట్ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం…
Bandar Apna Dost: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్కు చెందినదేనని వెల్లడైంది. వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ కాప్వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ట్రెండింగ్లో ఉన్న టాప్ 100 యూట్యూబ్ ఛానళ్లను పరిశీలించగా, పూర్తిగా ఏఐ (AI) సృష్టించిన వీడియోలపైనే ఆధారపడే వందలాది ఛానళ్లను గుర్తించింది. భారతీయ యూట్యూబ్ ఛానల్ “బందర్ అప్నా దోస్త్” ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఛానల్లో వాస్తవికంగా కనిపించే ఒక కోతిని ప్రధాన పాత్రగా…
Ola Electric Roadster X+: ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ రోడ్స్టర్ X+కు ప్రభుత్వ అనుమతి లభించిందని మంగళవారం ప్రకటించింది. ఈ అనుమతితో రోడ్స్టర్ X+ డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ బైక్లో కంపెనీ స్వదేశీగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించింది. 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న రోడ్స్టర్ X+కు సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ (CMVR), మానేసర్లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (iCAT) సర్టిఫికేషన్ ఇచ్చిందని కంపెనీ…
Dulhasti Stage 2 Project: పాకిస్థాన్కి గడ్డు కాలం మొదలు కానుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కమిటీ జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–2 జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాకిస్థాన్తో ఉన్న ఇండస్ జల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ) ప్రస్తుతం నిలిపివేసిన విషయం తెలిసిందే.