BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల ‘గర్ల్ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఓ కీలక అంశంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా లీగ్లో కనిపిస్తున్న “గర్ల్ఫ్రెండ్ కల్చర్” పట్ల బోర్డు తీవ్ర అసహనంతో ఉందట. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్దీప్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ గర్ల్ఫ్రెండ్స్తో కలిసి బహిరంగంగా కనిపిస్తుండటం, టీమ్ బస్సుల్లో వారితో కలిసి ప్రయాణించడం, హోటళ్లలో బస చేయడం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న బీసీసీఐ, దీనిని అడ్డుకోవడానికి కొత్త నిబంధనలు రూపొందించే పనిలో పడింది. ముఖ్యంగా, ఆటగాళ్లతో ఉండే ఈ భాగస్వాములలో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావడం బోర్డు ఆందోళనకు ప్రధాన కారణం. గతంలో వీరిలో కొందరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయని, వీరి వల్ల జట్టుకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం బయటకు పొక్కే ప్రమాదం ఉందని బీసీసీఐ భయపడుతోందట.
ఈ కల్చర్ గేమ్ సమగ్రతను దెబ్బతీస్తుందని బోర్డు భావిస్తోంది. అంతేకాకుండా, గతంలో కొంతమంది ఆటగాళ్లకు, వారి మహిళా స్నేహితులకు మధ్య వివాదాలు తలెత్తి పోలీసు ఫిర్యాదుల వరకు వెళ్లడం లీగ్ ప్రతిష్టను, బోర్డు గౌరవాన్ని మసకబార్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేయడం తప్పనిసరని బోర్డు నిర్ణయించుకుంది. ఓ ఉన్నత స్థాయి బీసీసీఐ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ, ఆటగాళ్ల గర్ల్ఫ్రెండ్స్ కోసం టీమ్ బస్సులను ఆపుతున్నారని.. ప్లేయర్స్తో పాటే హోటళ్లలో బస చేయడం సరికాదని మండిపడ్డారు. అసలు “అధికారిక గర్ల్ఫ్రెండ్” అనే నిబంధన బీసీసీఐ పాలసీలో ఎక్కడా లేదని, కేవలం భార్యలు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) అధికారులు సైతం కొందరు మహిళలను “అఫీషియల్ పార్ట్నర్స్” అని చెప్పగానే ఆటగాళ్లతో ఉండేందుకు ఎలా అనుమతించారనే కోణంలో విచారణ చేపట్టనున్నారని తెలిపారు. ఇక, త్వరలో జరగబోయే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, ఈ నిబంధనను కేంద్ర నిబంధనగా మార్చి అన్ని జట్లకు వర్తింపజేయాలని బీసీసీఐ యోచిస్తోందట. కేవలం ఐపీఎల్లోనే కాకుండా, భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు సైతం ఈ రూల్స్ వర్తిస్తాయని.. ప్రయాణ, బస ప్రోటోకాల్స్కు సంబంధించి ఏసీయూ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారట.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!