Hyderabad: జీడిమెట్లలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మద్యం…
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. చాదర్ఘాట్లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో హల్చల్ చేశారు. సెల్ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. రూ.60 విలువైన స్క్రీన్ గార్డ్ అంశమే ఈ రాదంతానికి కారణమని సమాచారం. గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను తాము రౌడీషీటర్లమని చెప్పుకుంటూ స్థానిక సెల్ఫోన్ రిపేర్ షాపులో దౌర్జన్యానికి దిగారు.
Eluru: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడిని ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండవల్లి మండలం కారు కొల్లు గ్రామానికి చెందిన సాయిచంద్ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో తాను ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు. సాయి దుర్గ ప్రస్తుతం ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమెన్గా విధులు నిర్వహిస్తోంది. తమ ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో…
Hyderabad Liquor Sales: హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్క రోజే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో రూ.5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు…
LPG Price Hike: నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి రోజే బిగ్ షాక్ వచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను పెంచాయి. జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలతో సహా దేశవ్యాప్తంగా రేట్లు పెరిగాయి. చమురు కంపెనీలు వాణిజ్య( కమర్షియల్) LPG సిలిండర్ల ధరలను రూ. 111 పెంచాయి. కానీ.. 14 కిలోల దేశీయ LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంటే మన ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్…
Hyderabad: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్కచేయకుండా కొందరు మందుబాబులు తాగి రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తమకే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిపెడుతున్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో రాష్ట్ర ప్రజలకు ఓ మాట సైతం ఇచ్చారు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను చేరుకుందని తెలిపారు.
PM Modi: గత పదేళ్లలో ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) ఆధ్వర్యంలో పనిచేసిన వ్యవస్థ ద్వారా రూ. 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తాజాగా ప్రగతి 50వ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని.. కార్యక్రమానికి సంబంధించిన తీసుకోవాల్సి చర్యల గురించి చర్చించారు. దేశంలో చేపడుతున్న సంస్కరణల వేగం పెరుగుదల, ప్రాజెక్టులు సమయానికి పూర్తవ్వాలంటే ప్రగతి ఎంతో అవసరం అని స్పష్టం చేశారు. ఎన్నో […]
Peddireddy Ramachandra Reddy: రాష్ట్ర ప్రజలకు ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతుందని.. ఈ రెండేళ్లలో ఒక అభివృద్ధి పథకం గాని సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అప్పుల కోసం వెంపర్లాడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని..
Anam Ramanarayana Reddy: భవంతుని సేవకు భక్తులను దూరం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రజలను అశాంతికి గురిచేసిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రశాంతంగా నిన్నటి రోజున లక్షల మంది పూజలు చేశారని తెలిపారు. తాజాగా నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.