బీహార్లోని ససారాం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్కు కష్టాలు చిక్కుల్లో పడ్డారు. మనోజ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్తో సహా నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ మైనర్ బాలిక తండ్రి కైమూర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.
పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతు తెలిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో అరబ్ దేశాల సమూహం సమర్పించిన తీర్మానంలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి అర్హత కలిగి ఉందని పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తెలిపేలా ఆదేశించాలని కోరుతూ.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మాల్దీవులు- భారత్ మధ్య కొంత కాలంగా ఓ వివాదం కొనసాగుతోంది. కొద్దినెలల కిందట భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేశారు. ఆయన సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలోని శివసేన(యూబీటీ)పై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ శివసేన నాయకులు తనను మట్టి కరిపిస్తామంటూ కలలు కంటున్నారన్నారు. ఈ నకిలీ శివసేన నాయకులు తనను సజీవ సమాధి చేయాలని మాట్లాడుతున్నారన్నారు.
డ్రాగెన్ మరో సారి తన సత్తా చాటుకుంది. ఇప్పటికే సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహక యుద్ధనౌక ఫ్యూజియాన్ను రంగంలోకి దించింది.
కుమారి ఆంటీ అందరికీ సుపరిచితమే. హైదరాబాద్లో ఫుడ్ వ్యాపారం చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె ఫేమస్ అవ్వడంతో భారీగా జనాలు ఫుడ్ సెంటర్ కి వచ్చే వాళ్లు. రోడ్పై ఫుడ్ అమ్మడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నందున.. పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు.
జేపీ ప్రచారం జోరు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఆన్ కౌల్టర్ అనే రచయిత్రి నిర్వహించిన పోడ్ కాస్ట్ షోలో పాల్గొన్న వివేక్ రామస్వామికి అవమానం ఎదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీపడి చివర్లో విరమించుకున్న వ్యాపారవేత్త వివేక్ రామస్వామి సుపరిచితమే.