Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో రక్తపాతం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ – తుడిచిపెట్టుకుపోయిన రూ.10 లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్ను ముంచేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. వారం చివరి రోజున మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు (1.93%) పతనమై 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 50: 488.05 పాయింట్లు (2.06%) క్షీణించి 23,151 వద్ద స్థిరపడింది.
READ ALSO: The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..
* ఇరాన్ రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో బ్రెంట్ ముడి చమురు ధర $100.5 మార్కును దాటింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ.
* అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం పుంజుకోవడంతో, భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.37 స్థాయికి పడిపోయింది.
* విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు రూ.39 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ను మరింత కుంగదీసింది.
* ఆసియా మార్కెట్లతో పాటు అమెరికాలోని డౌ జోన్స్, నాస్డాక్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
రంగాల వారీగా నష్టాలు
ఈ రోజు పతనంలో మెటల్, పిఎస్యు బ్యాంక్, ఆటో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు 4-5% వరకు నష్టపోయాయి. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని సంస్థలు మాత్రం స్వల్పంగా కోలుకున్నాయి. యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు మరింత పెరిగి, ద్రవ్యోల్బణం భారంగా మారుతుందనే ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉన్నందున పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Shantanu Narayen: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. అడోబ్ సీఈఓ పదవికి హైదరాబాదీ గుడ్ బై!
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!