Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో రక్తపాతం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ – తుడిచిపెట్టుకుపోయిన రూ.10 లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్ను ముంచేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. వారం చివరి రోజున మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు (1.93%) పతనమై 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 50: 488.05 పాయింట్లు (2.06%) క్షీణించి 23,151 వద్ద స్థిరపడింది.
READ ALSO: The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..
* ఇరాన్ రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో బ్రెంట్ ముడి చమురు ధర $100.5 మార్కును దాటింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ.
* అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం పుంజుకోవడంతో, భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.37 స్థాయికి పడిపోయింది.
* విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు రూ.39 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ను మరింత కుంగదీసింది.
* ఆసియా మార్కెట్లతో పాటు అమెరికాలోని డౌ జోన్స్, నాస్డాక్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
రంగాల వారీగా నష్టాలు
ఈ రోజు పతనంలో మెటల్, పిఎస్యు బ్యాంక్, ఆటో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు 4-5% వరకు నష్టపోయాయి. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని సంస్థలు మాత్రం స్వల్పంగా కోలుకున్నాయి. యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు మరింత పెరిగి, ద్రవ్యోల్బణం భారంగా మారుతుందనే ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉన్నందున పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Shantanu Narayen: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. అడోబ్ సీఈఓ పదవికి హైదరాబాదీ గుడ్ బై!
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!