Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
- హోటల్ ఫుడ్ ఐటెమ్స్కు అదనపు ఛార్జీలు..
- గ్యాస్ కొరతే కారణం అంటున్న హోటల్ యాజమాన్యాలు..
- యుద్ధ ప్రభావంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని సెగ భారతీయ సామాన్యుడి వంటగది వరకు తాకింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఆయిల్, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామం నేడు దేశవ్యాప్తంగా హోటల్ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ దిగుమతులు తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు అవసరమైన గ్యాస్ అందడం లేదు. ఈ సరఫరా నిలిచిపోవడంతో వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా హోటళ్లు తమ బోర్డులను తిప్పేస్తున్నాయి. గ్యాస్ లేనిదే వంటలు చేయడం సాధ్యం కాకపోవడంతో యాజమాన్యాలు హోటళ్లను మూసివేస్తున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు మాత్రం భారాన్ని కస్టమర్లపై వేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు కొనాల్సి వస్తోందని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచుతున్నామని హోటల్ యజమానులు వాపోతున్నారు.
Also Read
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
గతంలో రూ.40 ఉన్న టిఫిన్ ధర ఇప్పుడు రూ.60 నుంచి రూ.70కి చేరింది. సాధారణ ప్లేట్ మీల్స్ ధరపై 20 శాతం నుంచి 30 శాతం వరకు అదనపు భారం పడింది. చాయ్, కాఫీ వంటి కనీస అవసరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో దీని ప్రభావం అధికంగా పడింది. కర్రీ పాయింట్ లో కూడా అదనపు డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
నిన్నటి వరకు సాధారణంగా ఉన్న ధరలు, నేడు రెట్టింపు కావడంతో బయట తినే వారు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, బ్యాచిలర్లు, కూలీలు హోటల్ ధరలు చూసి కంగారు పడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో గ్యాస్, ఆయిల్ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం హోటల్ రంగమే కాకుండా.. రవాణా, నిత్యావసర వస్తువుల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!