సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్. ఆ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే చంపేయమని చెప్పింది.
ప్పర్ స్ప్రే ప్రమాదకరమైన ఆయుధమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.పిటిషనర్ల ఆస్తిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారని ఆరోపించిన ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్, అతని భార్యపై క్రిమినల్ కేసును రద్దు చేయడానికి కర్ణాటక హైకోర్టు ఇటీవల నిరాకరించింది.
భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రయాణికుల ఇబ్బందులకు కారణమైన సిబ్బందికి వేటు పడింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. సిబ్బంది ఉన్నపలంగా సెలవులు పెడుతున్నారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. తొలుత నిలబడి ఆపై మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం తలను నేలకు ఆన్చి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో షేర్ చేసింది.
నిజ్జర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతుల్లో ఒకరు స్టూడెంట్ వీసాతో కెనడాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. గ్లోబల్ న్యూస్లో ఒక కథనం ప్రకారం.. ఖలిస్థాని వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ఒకరు స్టూడెంట్ వీసా ఆధారంగా కెనడాలోకి ప్రవేశించారు.
కేదార్ నాథ్ ఆలయం ముస్తాబైంది. రేపే ఆలయ తలపులు తెరచుకోనున్నాయి. 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరవనున్నారు.
మన నీడ మనం ఎక్కడికి వెళ్లినా మన వెంటే ఉంటుంది. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకున్నా వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలు అయితే.. నీడతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. ఎప్పటికీ మన వెంటే ఉండే నీడ కొన్ని సందర్భాల్లో మాయమవుతుంది.
డిజిటల్ యుగంలో సాంకేతికత వినియోగం చాలా పనులను సులభతరం చేసింది. అయితే నేరస్థులు తమ అక్రమాలకు కూడా ఈ టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి చూసింది.