Mayonnaise Ban In Telangana : తెలంగాణలో మయోనైజ్ బ్యాన్.. ఎందుకంటే?
- తెలంగాణ రాష్ట్ర వైద్య.. ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
- రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్
- ప్రకటించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
- రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు.. 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్ని బ్యాన్ చేసింది. ఈ మయోనైజ్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలున్నాయని గుర్తించారు. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా దీన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ప్రముఖ హోటళ్లు, ఫుడ్స్టాళ్లలో దాడుల అనంతరం మయోనైజ్పై దర్యాప్తు ప్రారంభించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
READ MORE: New GST Rules: జీఎస్టీ రిటర్న్లో మార్పులు.. ఇకపై ఇలా చేయలేరు!
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
అయితే.. మయోనైజ్ అనేది అదొక చట్నీ లాంటి పదార్థం. దాన్ని పచ్చి గుడ్లతో, ఇతర ఇంగ్రిడియంట్స్ తయారు చేస్తారు. ఈ మయోనైజ్ ని షవర్మాలో, మొమోస్ లకు కలిపి తినేందుకు వాడతారు. హైదరాబాద్లో ఫేమస్ ఫుడ్స్లో ఒకటైన షావర్మాలో కూడా దీన్ని అధికంగా వినియోగిస్తారు. దీన్ని మండి బిర్యానీ, కబాబ్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరిగిన ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ హోటళ్లు తీరు మారట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.
READ MORE: Nimmala Ramanaidu: ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోంది..
రాష్ట్రంలో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది రోగాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై నిఘా పెంచింది. కాగా.. రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు, 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహా ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల్ని తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!