South Central Railway: తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ప్యాసింజర్కి రూ.25 వేల పరిహారం.. కారణం?
- ప్రయాణికుడికి రూ.25వేల పరిహారం
- రైల్వేలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుడు
- వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు
- ఈ మేరకు తీర్పు వెలువరించిన కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ప్యాసింజర్కి రూ.25,000 పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని జిల్లా వినియోగదారుల కమిషన్ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సిఆర్)ని ఆదేశించింది. ఈ ప్రయాణికుడు, అతని కుటుంబం తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. రైలులోని టాయిలెట్లలో నీటి కొరత, ఎయిర్ కండిషనింగ్ సరిగా లేకపోవడంతో ప్రయాణీకుడు, ఆయన కుటుంబం అనుభవించిన శారీరక, మానసిక క్షోభకు ప్రతిస్పందనగా ఈ పరిహారం ఇవ్వాలని బుధవారం నివేదించింది. రైల్వేలు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి నిబద్ధతతో ఛార్జీలు వసూలు చేస్తున్నందున, మరుగుదొడ్లలో నీరు, ఎయిర్ కండిషన్, సరైన పర్యావరణం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఉందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-I (విశాఖపట్నం) తీర్పు చెప్పింది.
READ MORE: UP Crime: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైనర్ బాలికపై జిమ్ ట్రైన్ అత్యాచారం..
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ఫిర్యాదు ఏమిటి?
జూన్ 5, 2023న, 55 ఏళ్ల వీ. మూర్తి, ఆయన కుటుంబం తిరుపతిలో రైలు ఎక్కారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు తిరుమల ఎక్స్ప్రెస్లో నాలుగు 3ఎసి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
ఈ కోచ్లో సరైన నీటి సదుపాయం, ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం వల్ల ఆయనతో పాటు కుటుంబీకులు కూడా ఇబ్బందికి గురయ్యారు. టాయిలెట్లు కూడా సరిగ్గా లేవు. కుటుంబానికి మొదట B-7 కోచ్లో బెర్త్ కేటాయించారు. తర్వాత వారిని 3ఏ బదులుగా 3ఈ కోచ్కు బదిలీ చేసినట్లు ఆయనకు రైల్వే అధికారుల నుంచి సందేశం వచ్చింది. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆయన సంబంధిత రైల్వే కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్ని సంప్రదించారు. అయితే.. రైల్వే శాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది. మూర్తి ప్రభుత్వం నుంచి డబ్బులు దండుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేశారని వాదించింది. ఆయన కుటుంబం రైల్వే సేవలను ఉపయోగించి సురక్షితంగా చేరుకున్నారని తెలిపింది.
READ MORE:King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!