South Central Railway: తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ప్యాసింజర్కి రూ.25 వేల పరిహారం.. కారణం?
- ప్రయాణికుడికి రూ.25వేల పరిహారం
- రైల్వేలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుడు
- వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు
- ఈ మేరకు తీర్పు వెలువరించిన కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ప్యాసింజర్కి రూ.25,000 పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని జిల్లా వినియోగదారుల కమిషన్ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సిఆర్)ని ఆదేశించింది. ఈ ప్రయాణికుడు, అతని కుటుంబం తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. రైలులోని టాయిలెట్లలో నీటి కొరత, ఎయిర్ కండిషనింగ్ సరిగా లేకపోవడంతో ప్రయాణీకుడు, ఆయన కుటుంబం అనుభవించిన శారీరక, మానసిక క్షోభకు ప్రతిస్పందనగా ఈ పరిహారం ఇవ్వాలని బుధవారం నివేదించింది. రైల్వేలు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి నిబద్ధతతో ఛార్జీలు వసూలు చేస్తున్నందున, మరుగుదొడ్లలో నీరు, ఎయిర్ కండిషన్, సరైన పర్యావరణం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఉందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-I (విశాఖపట్నం) తీర్పు చెప్పింది.
READ MORE: UP Crime: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైనర్ బాలికపై జిమ్ ట్రైన్ అత్యాచారం..
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ఫిర్యాదు ఏమిటి?
జూన్ 5, 2023న, 55 ఏళ్ల వీ. మూర్తి, ఆయన కుటుంబం తిరుపతిలో రైలు ఎక్కారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు తిరుమల ఎక్స్ప్రెస్లో నాలుగు 3ఎసి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
ఈ కోచ్లో సరైన నీటి సదుపాయం, ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం వల్ల ఆయనతో పాటు కుటుంబీకులు కూడా ఇబ్బందికి గురయ్యారు. టాయిలెట్లు కూడా సరిగ్గా లేవు. కుటుంబానికి మొదట B-7 కోచ్లో బెర్త్ కేటాయించారు. తర్వాత వారిని 3ఏ బదులుగా 3ఈ కోచ్కు బదిలీ చేసినట్లు ఆయనకు రైల్వే అధికారుల నుంచి సందేశం వచ్చింది. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆయన సంబంధిత రైల్వే కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్ని సంప్రదించారు. అయితే.. రైల్వే శాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది. మూర్తి ప్రభుత్వం నుంచి డబ్బులు దండుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేశారని వాదించింది. ఆయన కుటుంబం రైల్వే సేవలను ఉపయోగించి సురక్షితంగా చేరుకున్నారని తెలిపింది.
READ MORE:King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?
తాజావార్తలు
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!