OpenAI: షాకింగ్ న్యూస్.. ఉచిత చాట్జీపీటీకి బ్రేక్.. కంపెనీ సంచలన నిర్ణయం..
OpenAI: చాట్జీపీటీని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలో చాట్జీపీటీలో యాడ్స్ ప్రత్యేక్షం కానున్నాయి. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ప్రకటనలు ప్రారంభం కాలేదని, వచ్చే కొన్ని వారాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపడతామని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి ఆదాయం పొందేందుకు ఇది మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్జీపీటీకి 80 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉచితంగానే సేవలను వినియోగిస్తున్నారు. కంపెనీ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరినా, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో లాభాలు ఆర్జించలేకపోతోంది. అందుకే కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
READ MORE: PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్కు మోడీ.. వందే భారత్ స్లీపర్ను ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
ఇక నుంచి చాట్జీపీటీ సమాధానాలు ఇచ్చే ముందు ప్రకటనలు ప్రత్యేక్షమవుతాయని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. ఈ అంశంపై కంపెనీ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో మాట్లాడుతూ.. యూజర్లకు వచ్చే సమాధానాలు యథాతథంగానే ఉంటాయని చెప్పారు. ఎవరైనా అడిగే ప్రశ్నలకు అనుగుణంగా వారికి కావాల్సిన ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన ప్రకటనలు చూయిస్తామని.. అది కూడా చాట్జీపీటీ ఇచ్చిన సమాధానాల కింది భాగంలో యాడ్స్ వస్తాయన్నారు. కాగా.. డిజిటల్ ప్రకటనల రంగంలో ఇప్పటికే గూగుల్, మెటా వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తమ ఏఐ సేవల్లో ఇప్పటికే ప్రకటనలను భాగంగా చేసుకున్నాయి. మొదట ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏఐని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఓపెన్ఏఐ, గత ఏడాది తన వ్యాపార నిర్మాణాన్ని మార్చుకుని పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్గా మారింది. అయితే ఈ నిర్ణయంపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలు, సలహాల కోసం చాట్బాట్లను ఉపయోగించే వినియోగదారుల నమ్మకాన్ని ప్రకటనల కోసం వాడుకోవడం ప్రమాదకర మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు గతంలో ఇదే దారిలో వెళ్లాయని, దాని ప్రభావాలు అందరికీ తెలిసినవేనని వారు అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!