BMC Elections: 25 ఏళ్ల శివసేన పాలనకు బ్రేక్.. ఠాక్రే సోదరుల పతనాకి కారణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Elections: దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనిక, అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా పేరున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో (బీఎంసీ) తొలిసారి బీజేపీ మేయర్ పదవి దక్కించుకోబోతోంది. కేవలం బీఎంసీ మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో 25 చోట్ల మహాయుతి ఘన విజయం సాధించింది. ఠాక్రే సోదరులు సహా మొత్తం ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారాయి. ఈ ఎన్నికలతో 25 ఏళ్ల తర్వాత బీఎంసీపై శివసేన పట్టు పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం ఏమవుతుంది? ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన ఉనికిని కాపాడాలనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు కలిసినా.. వారిని మహారాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ముంబైలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు 25 ఏళ్ల తర్వాత గుడ్బై చెప్పాల్సి వచ్చింది.
READ MORE: Royal challengers vs Giants: ఆర్సీబీ హ్యాట్రిక్ విజయం.. 32 పరుగుల తేడాతో గుజరాత్పై గెలుపు
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఈ ఫలితాలు ఉద్ధవ్–రాజ్ జోడీని ముంబై ప్రజలు అంగీకరించలేదని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ జోడీ రాజకీయాలు ప్రజలకు ఆకట్టుకోలేకపోయింది. ఉత్తర భారతీయులపై జరిగిన హింస ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మరాఠేతర ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో ఠాక్రే సోదరులు విఫలమయ్యారు. మరోవైపు ముస్లిం ఓటర్లు ఈ కూటమికి దూరంగా ఉన్నారు. గత 25 ఏళ్లుగా మతోశ్రీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా జరుపుకునే సంబరాలు ఈసారి కనిపించలేదు. అక్కడ నిశ్శబ్దమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజ్ ఠాక్రేతో కలిసి రావడం ఉద్ధవ్కు నష్టమయ్యిందా? కాంగ్రెస్కు దూరంగా ఉండటం రాజకీయంగా భారమైందా? బాలాసాహెబ్ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో షిండేతో ఉన్న శివసేనపై ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారా? ఇక ముందు కూడా రాజ్–ఉద్ధవ్ కలిసి పోటీ చేస్తారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
READ MORE: OpenAI: షాకింగ్ న్యూస్.. ఉచిత చాట్జీపీటీకి బ్రేక్.. కంపెనీ సంచలన నిర్ణయం..
ఇక ఉద్ధవ్ ఠాక్రే శివసేన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అనంతంరం.. ఆయన వ్యూహాన్ని మార్చుకున్నారు. మహావికాస్ అఘాడీ నుంచి దూరమై, పాత విభేదాలను పక్కనపెట్టి సోదరుడితో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు ఆ వ్యూహం ఫలించలేదు. బాలాసాహెబ్ వారసత్వాన్ని పదేపదే ప్రస్తావించినా.. ఓటర్లు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. 25 ఏళ్లుగా బీఎంసీని పాలించిన శివసేనపై సహజంగా వ్యతిరేకత పెరిగింది. ఠాక్రే భారీ ర్యాలీలకన్నా ప్రెస్ కాన్ఫరెన్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలతో నేరుగా అనుసంధానం తగ్గింది. అంతే కాదు.. కేవలం మరాఠీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడం మిగతా వర్గాలను దూరం చేసింది. హిందీ భాషపై రాజకీయాలు, హిందీ మాట్లాడేవారిపై దాడులు, ముంబై మేయర్ తప్పనిసరిగా మరాఠీ వాడే కావాలన్న హామీలు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. ఈ అన్ని అంశాలు కలిసి ఠాక్రే సోదరుల రాజకీయానికి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!