Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Adilabad Development University Airport Announcement

CM Revanth Reddy: అందుకే నెలకు మూడు సార్లు కేంద్రం, మోడీని కలుస్తున్నా.. సీఎం కీలక వ్యాఖ్యలు..

Published Date :January 16, 2026 , 5:20 pm
By RAMAKRISHNA KENCHE
CM Revanth Reddy: అందుకే నెలకు మూడు సార్లు కేంద్రం, మోడీని కలుస్తున్నా.. సీఎం కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ కు జరగాల్సిన న్యాయం, చేయాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. పాలమూరు తో సమానంగా ఆదిలాబాద్ జిల్లా కు నిధులు ఇస్తున్నామని చెప్పారు. తాజాగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూసేకరణ కు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు వర్శిటీ లేదని.. ఈ ప్రాంతానికి వర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలో వర్సిటీ మంజూరు అవుతుందన్నారు. బాసర వర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని.. దానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆదిలాబాద్ వర్సిటీ బాసరలో ఏర్పాటు చేస్తున్నామని.. ఉమ్మడి జిల్లా కు కావాల్సిన నిధులను బడ్జెట్ లో ప్రవేశ పెట్టుతామన్నారు.. తుమ్మడి హెట్టీ వద్ద ప్రాణహిత చేవెళ్ల పై నివేదిక తయారు చేస్తున్నామని.. తుమ్మడి హెట్టీ వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కని ఓడి పట్టుతామన్నారు.. ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు శిలాఫలకం వేయిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాక రాజకీయం.. ఎన్నికల తర్వాత అభివృద్ధికి కలిసి నడుద్దామన్నారు. ప్రతి మూడు నెలలకు సారి కేంద్రాన్ని కలుస్తాం.. మీరు సైతం నా దగ్గరకు రండి.. సాధ్యం అయినంత పనులు చేస్తామని ప్రతిపక్ష నేతలకు సీఎం తెలిపారు. మోడీ నాకు చుట్టం కాదు దేశానికి ప్రధాని కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి కావాలి కాబట్టి మోడీని కలుస్తున్నానని చెప్పారు. ప్రాంత అభివృద్ధి కోసం ఎవ్వైర్నినా కలుస్తా. పైరవీలు లేవు, పర్సనల్ పనులు నాకు లేవని సీఎం స్పష్టం చేశారు.

READ MORE: MSVG : 4 రోజులు.. 200 కోట్లు.. మెగా మాస్ ఆన్ డ్యూటీ!

కేంద్రం వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ఇస్తాం అని చెప్పినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. “ఇవ్వన్నీ అడిగనిదే ఇవ్వరు. గత పాలకులు అడగకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ల తప్పులకు ఇప్పుడు అప్పులు మిగిలాయి. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎవ్వరైనా తిన్నారా..? కాని మేము ఇచ్చే సన్న బియ్యం తింటున్నారు. నాడు పావలా వడ్డీ లేదు సున్నా వడ్డీ లేదు.. గుండు సున్నా మిగిల్చారు. వెయ్యికోట్ల భూమి మహిళలకు కేటాయించాం.. ఒక అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. నిర్మల్‌కు ATC మంజూరు చేస్తున్నాం.. నాగోబా జాతరకు రూ. 22 కోట్లు మంజూరు చేస్తాం. సమ్మక్క సారలమ్మ మందిరాన్ని తీర్చి దిద్దుతున్నాం. ఈనెల 18 న మేడారంలో ప్రారంభిస్తాం. ప్రపంచ పెట్టుబడుల స్వర్గధామంగా హైదరాబాదును మార్చాం.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి వల్ల క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుందాం.. రాష్ట్ర ప్రజలు అండగా నిలవండి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి… ప్రజా ప్రభుత్వంతో కలిసి పని చేసే వారిని గెలిపించండి.. కేవలం ఎన్నికల అప్పుడే రాజకీయాలు, అభివృద్ధికి అందరం ఒకటే..” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad airport latest news
  • Adilabad district development
  • Adilabad university announcement
  • Basara University Telangana
  • Nagoba Jatara funds

తాజావార్తలు

  • Sanjay Dutt : బాక్సాఫీస్ ధురంధర్‌ సంజయ్ దత్.. 4 సార్లు 1000 కోట్ల క్లబ్‌లోకి

  • Harish Rao : రాష్ట్రంలో నిర్బంధ పాలన, పోలీస్ రాజ్యం నడుస్తోంది

  • India-Iran: 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక

  • Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌ పై ఐదేళ్ల వేటు!

  • Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions