India 5G Users: వామ్మో ఇలా వాడేస్తున్నారేంట్రా.. 5G సేవల్లో భారత్ రెండోస్థానం.. అంచనాలకు మించి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India 5G Users: భారత టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 5జీ సేవలు ప్రారంభమై కేవలం మూడు ఏళ్లకే ఈ సాంకేతికత కోట్లాది మంది వినియోగదారుల దైనందిన జీవితంలో భాగమైంది. 5జీ విస్తరణలో భారత్ కీలక మైలురాళ్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు, పరిశ్రమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లను దాటింది. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ వినియోగదారుల దేశంగా భారత్ నిలిచింది. మొదటి స్థానంలో చైనా కొనసాగుతోంది. చైనాలో రూ.100 కోట్లకు పైగా 5జీ వినియోగదారులు ఉన్నారు. భారత్ తర్వాత అమెరికా, యూరోప్, జపాన్ ఉన్నాయి. ఈ సంఖ్యలు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న 5జీ మార్కెట్లలో ఒకటిగా మారిందని సూచిస్తున్నాయి. గతంలో 2025 చివరికి దాదాపు 39.4 కోట్ల మంది వినియోగదారులు పెరుగుతారని అంచనా వేయగా.. ఆ అంచనాలను తలకిందులు చేసింది.
READ MORE: Mamata Banerjee : మా ప్రభుత్వం ఎల్లప్పుడూ వలస కూలీల కుటుంబాలకు అండగా ఉంటుంది
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
- Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
- YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
భారత్లో 5జీకి బలమైన పునాది 2022 అక్టోబర్లో పడింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. వేగవంతమైన ఇంటర్నెట్, డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆ సమయంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 5జీలో సేవలు ప్రజల్లోకి తీసుకొచ్చాయి. టెలికాం కంపెనీలలో ముందుగా రిలయన్స్ జియో తన జియో ట్రూ 5జీ సేవలను వాణిజ్యంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వెంటనే భారతి ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. వొడాఫోన్ ఐడియా మాత్రం నిధుల సమీకరణ, నెట్వర్క్ అభివృద్ధి తర్వాత 2024లో 5జీ రంగంలోకి అడుగుపెట్టి, 2025లో విస్తరణకు ప్రణాళికలు వేసింది. ఈ క్రమంలో కొత్త టవర్లు, ఫైబర్ నెట్వర్క్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. భారత్లో 5జీ వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం అందుబాటు ధరలే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మొబైల్ డేటా ఖర్చు చాలా తక్కువ. 5జీ సేవలకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల ధరలు కొంత పెరిగినా, పెద్ద దేశాల్లో భారత్ డేటా చౌకగా లభించే దేశంగానే ఉంది.
READ MORE: Anasuya: అనసూయపై కామెంట్స్..జర్నలిస్టులు సహా 72 మందిపై కేసు
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!