BMC Election Results: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? పూర్తి రిపోర్టు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Election Results: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముంబై రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 227 వార్డుల ఫలితాలు ప్రకటించగా, దాదాపు 25 ఏళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న BMCలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ–షిండే శివసేన కూటమి కలిసి మొత్తం 118 సీట్లు గెలుచుకుంది. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు కాగా, కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో దాటింది. 2017లో కేవలం 82 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి తన గత రికార్డును దాటేసింది. కేవలం బీజేపీ 89 వార్డుల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ గెలిచిన అభ్యర్థులకు మొత్తం 11,79,273 ఓట్లు వచ్చాయి. ఇది గెలిచిన అభ్యర్థుల ఓట్లలో 45.22 శాతం, మొత్తం పోలైన ఓట్లలో 21.58 శాతం.
READ MORE: TDP Vs YCP Leaders Fight: కాకినాడలో టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
Also Read
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు 65 సీట్లు వచ్చాయి. వారికి మొత్తం 7,17,736 ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 27.52 కాగా, మొత్తం పోలింగ్లో ఠాక్రే వర్గం వాటా 13.13 శాతం. రెండో స్థానంలో నిలిచినా, BMC అధికారానికి మాత్రం దూరమయ్యారు. మరోవైపు.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 వార్డుల్లో గెలిచింది. ఈ పార్టీకి మొత్తం 2,73,326 ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 10.48 కాగా, మొత్తం పోలింగ్లో 5 శాతం వాటా దక్కింది. కాంగ్రెస్కు 24 సీట్లు లభించాయి. మొత్తం 2,42,646 ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 9.31. కొన్ని చోట్ల వంచిత్ బహుజన్ ఆఘాడితో కలిసి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రదర్శన బలహీనంగా కనిపించింది.
READ MORE: Mauni Amavasya 2026: రేపు ఆదివారం మౌనీ అమావాస్య.. ఇవి పాటిస్తే మంచి ఫలితాలు!
ఇతర పార్టీల ఫలితాలు..
AIMIMకు 8 సీట్లు, 68,072 ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు 6 సీట్లు, 74,946 ఓట్లు లభించాయి. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి 3 సీట్లు, 24,691 ఓట్లు వచ్చాయి. శరద్ పవార్ వర్గం ఎన్సీపీకి ఒక్క సీటే దక్కింది, 11,760 ఓట్లు వచ్చాయి. సమాజవాదీ పార్టీకి 2 సీట్లు, 15,162 ఓట్లు లభించాయి. మొత్తం పోలింగ్ విషయానికి వస్తే 54,64,412 ఓట్లు పడగా, 11,677 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. మొత్తం పోలింగ్ శాతం 47.72గా నమోదైంది. కూటముల పరంగా చూస్తే, ముంబై, థానే, కల్యాణ్-డొంబివ్లీ, వసాయి-విరార్, భివండి, పణవెల్ ప్రాంతాల్లో బీజేపీ–శిందే శివసేన కలిసి పోటీ చేశాయి. పుణే, పింపరి-చించవాడ్లో అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాల ఎన్సీపీ కూటమి ఉంది. పుణేలో ఉద్ధవ్–రాజ్ ఠాక్రేలు కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. నవి ముంబై, మీరా-భాయందర్, ఉల్హాసనగర్లలో బీజేపీ, శిందే వర్గం వేర్వేరుగా పోటీ చేశాయి. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్, ప్రకాశ్ ఆంబేడ్కర్ పార్టీ కలిసి ఎన్నికల్లో నిలిచాయి. ఈ ఫలితాలతో ముంబై రాజకీయాల్లో పెద్ద మార్పు ఖాయమైంది. ఎన్నాళ్లుగానో ఠాక్రే కుటుంబానికి అజేయ కంచుకోటగా ఉన్న BMCలో ఇప్పుడు బీజేపీ–శిందే శివసేన కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!