BMC Election Results: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? పూర్తి రిపోర్టు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Election Results: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముంబై రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 227 వార్డుల ఫలితాలు ప్రకటించగా, దాదాపు 25 ఏళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న BMCలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ–షిండే శివసేన కూటమి కలిసి మొత్తం 118 సీట్లు గెలుచుకుంది. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు కాగా, కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో దాటింది. 2017లో కేవలం 82 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి తన గత రికార్డును దాటేసింది. కేవలం బీజేపీ 89 వార్డుల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ గెలిచిన అభ్యర్థులకు మొత్తం 11,79,273 ఓట్లు వచ్చాయి. ఇది గెలిచిన అభ్యర్థుల ఓట్లలో 45.22 శాతం, మొత్తం పోలైన ఓట్లలో 21.58 శాతం.
READ MORE: TDP Vs YCP Leaders Fight: కాకినాడలో టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
Also Read
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు 65 సీట్లు వచ్చాయి. వారికి మొత్తం 7,17,736 ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 27.52 కాగా, మొత్తం పోలింగ్లో ఠాక్రే వర్గం వాటా 13.13 శాతం. రెండో స్థానంలో నిలిచినా, BMC అధికారానికి మాత్రం దూరమయ్యారు. మరోవైపు.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 వార్డుల్లో గెలిచింది. ఈ పార్టీకి మొత్తం 2,73,326 ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 10.48 కాగా, మొత్తం పోలింగ్లో 5 శాతం వాటా దక్కింది. కాంగ్రెస్కు 24 సీట్లు లభించాయి. మొత్తం 2,42,646 ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 9.31. కొన్ని చోట్ల వంచిత్ బహుజన్ ఆఘాడితో కలిసి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రదర్శన బలహీనంగా కనిపించింది.
READ MORE: Mauni Amavasya 2026: రేపు ఆదివారం మౌనీ అమావాస్య.. ఇవి పాటిస్తే మంచి ఫలితాలు!
ఇతర పార్టీల ఫలితాలు..
AIMIMకు 8 సీట్లు, 68,072 ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు 6 సీట్లు, 74,946 ఓట్లు లభించాయి. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి 3 సీట్లు, 24,691 ఓట్లు వచ్చాయి. శరద్ పవార్ వర్గం ఎన్సీపీకి ఒక్క సీటే దక్కింది, 11,760 ఓట్లు వచ్చాయి. సమాజవాదీ పార్టీకి 2 సీట్లు, 15,162 ఓట్లు లభించాయి. మొత్తం పోలింగ్ విషయానికి వస్తే 54,64,412 ఓట్లు పడగా, 11,677 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. మొత్తం పోలింగ్ శాతం 47.72గా నమోదైంది. కూటముల పరంగా చూస్తే, ముంబై, థానే, కల్యాణ్-డొంబివ్లీ, వసాయి-విరార్, భివండి, పణవెల్ ప్రాంతాల్లో బీజేపీ–శిందే శివసేన కలిసి పోటీ చేశాయి. పుణే, పింపరి-చించవాడ్లో అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాల ఎన్సీపీ కూటమి ఉంది. పుణేలో ఉద్ధవ్–రాజ్ ఠాక్రేలు కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. నవి ముంబై, మీరా-భాయందర్, ఉల్హాసనగర్లలో బీజేపీ, శిందే వర్గం వేర్వేరుగా పోటీ చేశాయి. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్, ప్రకాశ్ ఆంబేడ్కర్ పార్టీ కలిసి ఎన్నికల్లో నిలిచాయి. ఈ ఫలితాలతో ముంబై రాజకీయాల్లో పెద్ద మార్పు ఖాయమైంది. ఎన్నాళ్లుగానో ఠాక్రే కుటుంబానికి అజేయ కంచుకోటగా ఉన్న BMCలో ఇప్పుడు బీజేపీ–శిందే శివసేన కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!