మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు.
హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ ను నిలిపేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల కమిషన్ను అభ్యర్థించింది. సుదీర్ఘ వారంతపు సెలవుల( లాంగ్ వీకెండ్) కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు. శనివారం రాయ్పూర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సల్స్ దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు. READ MORE: Tragedy: […]
ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.
ఈ విశ్వంలో భూమి కాకుండా మరెక్కడైనా జీవం ఉందా? దీనిపై గత కొన్ని శతాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఆధారాలు ఏవీ లభించలేదు. మనమందరం గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక కథనాలను వింటునే ఉన్నాం.
పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం శనివారం ఉదయం పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకి మరణించిన విషయం తెలిసిందే.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది.
జమ్మూకశ్మీర్లో ఎన్నికల తేదీలు ప్రకటించారు. భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కార్యకలాపాలు తీవ్రంగా ఉంటాయి. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్కు ఇదంతా ఆమోదయోగ్యంగా లేదు.