Amit Shah: 2026 మార్చి నాటికి ఒక్కరు కూడా ఉండరు!.. నక్సల్స్ కి అమిత్ షా హెచ్చరిక..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటన
- శనివారం రాయ్పూర్లో విలేకరుల సమావేశం
- . 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు. శనివారం రాయ్పూర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సల్స్ దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు.
READ MORE: Tragedy: విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
Also Read
శనివారం రాయ్పూర్లో నక్సలిజం సమస్యపై హోంమంత్రి సమావేశం నిర్వహించారు. ఇందులో అభివృద్ధి అంశంపై కూడా చర్చ జరిగింది. విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. “నేను ఛత్తీస్గఢ్లో నక్సలిజం పాత సమస్యే. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో భారత ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పథకాలన్నింటినీ 100 శాతం అమలు చేస్తాం. వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రభావిత ప్రాంతాలు పురోగతి మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాం.” అని ఆయన పేర్కొన్నారు. నేడు జరిగిన సమావేశంలో ఛత్తీస్గఢ్తో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాల డీజీలు, ప్రధాన కార్యదర్శులను కూడా పిలిచామని అమిత్ షా తెలిపారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో నక్సల్ సమస్యను పరిష్కరించేందుకు పూనుకున్నప్పుడు పొరుగు రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోవడం అవసరమన్నారు. ఇప్పుడు బలమైన వ్యూహంతో వామపక్ష తీవ్రవాదంపై తుది దెబ్బ కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని హోంమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!