UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
- వరకట్న హత్య కేసులో భర్త.. అత్తమామలకు జీవిత ఖైదు
- ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో స్థానిక కోర్టు తీర్పు
- దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.
READ MORE: CP Srinivas Reddy: గుజరాత్లో 10 రోజుల పాటు ఆపరేషన్.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
బరేలీ నగరంలోని సిబిగంజ్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్.. తన కుమార్తెకు చనేటా గ్రామానికి చెందిన దర్శన్ సింగ్తో 2020లో వివాహం జరిపించారు. పెళ్లయినప్పటి నుంచి కూతురిని భర్త, అత్తగారు వేధించేవారని బాధితురాలి తండ్రి ప్రమోద్ పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్, రూ.2 లక్షలు ఇవ్వాలని వేధించారు. దీంతో బాధితురాలు ఆందోళన చెందుతూ ఉండేది. వరకట్న డిమాండ్ నెరవేరకపోవడంతో.. నిందితులు ఫిబ్రవరి 6, 2021న బాధితురాలిని హత్య చేశారు. పోస్టుమార్టంలో బాధితురాలి మెడపై తాడు గుర్తులు కనిపించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏడుగురు సాక్షులను హాజరుపరిచింది. అనంతరం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు 2021లో ఫతేగంజ్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ప్రభుత్వ అసిస్టెంట్ అడ్వకేట్ అనూప్ కొహర్వాలా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నేడు జీవిత ఖైది విధిస్తూ.. తీర్పు వెలువడిందని పేర్కొన్నారు.
READ MORE: Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
కాగా.. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లా నుంచి గత వారం మరో వరకట్న మరణ కేసు వెలుగులోకి వచ్చింది. కట్నం డిమాండ్తో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడైన భర్తతో పాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితురాలు 2019 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కట్నం కోసం డిమాండ్ మొదలైంది. నెరవేరకపోవడంతో ఇటీవల హత్య చేశాడు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..