తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల 'జాతా' ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తనపై కుట్ర జరుగుతోందని పేరుమోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్నారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ను ఇరికిస్తున్నారన్నారు. నేను జైలులో ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ఎలా బెదిరిస్తాను? అని పేర్కొన్నారు. జైలు నుంచి హత్య ఎలా చేస్తాం? అని తెలిపారు. శనివారం జోధ్పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో లారెన్స్ బిష్ణోయ్ తన వివరణ ఇచ్చారు.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు.
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్ఫిషర్ టవర్స్లో విలాస వంతమైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. రూ. 50 కోట్ల విలువైన ఈ విలాసవంతమైన ఫ్లాట్, ఈ ప్రాంతంలోని నివాస ప్రాపర్టీ ధరలకు కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసిందట. చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం. ఈ భవనంలోని పదహారవ అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాలుగు బెడ్రూమ్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు […]
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పాత్రలు మాత్రమే మారాయని.. అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగదని తెలిపారు. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును బట్టి మంత్రులను ఎంపిక చేస్తామన్నారు. ఇక డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మహీంద్రా వాహనాల అమ్మకాలు గత 3 నెలలతో పోల్చితే నవంబర్లో అత్యల్పంగా ఉన్నాయి. కంపెనీ సెప్టెంబర్లో 51,062 యూనిట్లు, అక్టోబర్లో 54,504 యూనిట్లను విక్రయించింది. కాగా, నవంబర్లో ఈ సంఖ్య 46,222 యూనిట్లకు తగ్గింది. కంపెనీకి సంబంధించి మహింద్రా థార్ మినహా అన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గాయి. ప్రతిసారీ మాదిరిగానే కంపెనీకి తక్కువ డిమాండ్ ఉన్న కారు మరాజో.. నవంబర్లో కేవలం 9 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అక్టోబర్లో 37 యూనిట్లు విక్రయించారు.
జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీ జీప్ కంపాస్పై డిసెంబర్లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్పై వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారుల ఆఫర్పై రూ. 3.20 లక్షలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ. 1.40 లక్షలు తగ్గించింది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ కూడా ఇస్తోంది. దీంతో మీరు ఈ SUVపై రూ. 4.75 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర […]