BJP: డీ లిమిటేషన్పై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం.. బీజేపీ నాయకుల స్పందన
- అసెంబ్లీలో డీ లిమిటేషన్పై తీర్మానం
- పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్న సీఎం
- ఈ తీర్మానంపై స్పందించిన బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
- కాంగ్రెస్-బీఆర్ఎస్ వైఖరిపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. “జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర మంత్రి అంటున్నారు. కేంద్రానికి .. తెలంగాణ సభ నుండి తీర్మానం చేసి పంపాలని నిర్ణయం తీసుకున్నాం.” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
READ MORE: 10th Exam Paper Leak: కేటీఆర్పై కేసులు పెట్టడం ఏంటి.. లీకేజీకి కారకులెవ్వరు?: ఆర్ఎస్ ప్రవీణ్
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
ఈ తీర్మానంపై బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ స్పందించారు. “శాసన సభలో ముఖ్యమంత్రి నియోజకవర్గాల పునర్విభజనపై తీర్మానం ప్రవేశ పెట్టాడు.. దాని పై చర్చ చేస్తాం అంటే అవకాశం ఇవ్వడం లేదు.. డీ లిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోరాటం చేస్తామని అంటున్నారు.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటి..? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయి.. మొన్న చెన్నైలో ఇరు పార్టీలు వెళ్లి స్టాలిన్ వీపు గోకి వచ్చారు.. స్టాలిన్కు వీపు దురద పెట్టడానికి కారణం ఉంది.. వచ్చే కొద్ది రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి స్టాలిన్ డీ లిమిటేషన్ పై చర్చ పెట్టాడు.. కానీ మన రాష్ర్టంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇక్కడ పని చేయడం మానేసి స్టాలిన్ వీపు గోకడానికి వెళ్ళారు.. డీ లిమిటేషన్ ఎవరికీ తెలియకుండా ఏమైనా చాటుగా చేస్తారా? డీ లిమిటేషన్ వల్ల ఏదో నష్టం జరగబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. వారి పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని పక్క దారి పట్టించేందుకు మోడీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.. బీజేపీ పార్టీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమే.. అన్ని ప్రాంతాల్లో ప్రజలు మాకు సమానమే.. ఎక్కడా కూడా ఎలాంటి నష్టం ఉండబోదని కేంద్ర మంత్రులు బహిరంగంగా చెబుతున్నారు.. జిల్లాలను విభజించిన విషయం బీఆర్ఎస్ మరిచి పోయింది..” అని పాయల్ శంకర్ స్పష్టం చేశారు. మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!