దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గనణీయంగా వృద్ధి చెందుతోంది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకి సంస్థ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మారుతీ సుజుకికి చెందిన విటారాకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది.
పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.
నూతన సంవత్సరం వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో 1995 సీఎంను చూస్తారని చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ.. తాను రాజకీయ కక్షలకు పాల్పడనని చెప్పారు. అలాగని.. తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. సెకీ అంశం తనకు లాడ్డూ లాగే అనిపిస్తుందన్నారు.
హ్యుందాయ్ క్రెటా తన మునుపటి అమ్మకాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇది మాత్రమే కాదు.. మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఇది అవతరించింది. ఈ విభాగంలో బలమైన పోటీ ఉన్నప్పటికీ.. ఇది 2024 సంవత్సరంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, ఎమ్జీ ఆస్టర్ వంటి మోడల్లు ఉన్నాయి. అయితే.. హ్యుందాయ్ క్రెటా…
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది.
2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.
దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్లు, విందులతో సందడి చేశారు.
కేరళ తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ ట్యూషన్ టీచర్కు 111 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో టీచర్ దోషిగా తేలాడు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్ను దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 44 ఏళ్ల ఉపాధ్యాయుడు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది పాటు జైలులో ఉండాల్సిందేనని…
భారతదేశం గతంలో వ్యవసాయంపై ఆధారపడింది. ప్రపంచీకరణ తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా మారిపోయింది. వ్యవసాయంపై ప్రజలు ఆధారపడటం తగ్గిపోయింది. శ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించింది. అయితే.. ఉపాధిపై ఆధారపడటం పెరిగింది. దేశంలో పరిశ్రమల వృద్ధి కారణంగా ఉద్యోగావకాశాలు కూడా పెద్దఎత్తున సృష్టించబడ్డాయి.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారత్కు అప్పగించవచ్చు. రాణాను భారత్కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది.