Maruti Suzuki: డిసెంబర్లో రికార్డు బద్దలుగొట్టిన మారుతీ సుజుకి.. ఎన్ని కార్లు అమ్మిందంటే?
- దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి
- డిసెంబర్ లో భారీగా కార్ల విక్రయాలు
- ఎగుమతుల్లో భారీ కూడా పెరుగుదల
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది. మరోసారి సంస్థ రికార్డు బద్ధలు గొట్టింది. ముఖ్యంగా ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా 62,788 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇందులో స్విఫ్ట్ డిజైర్ వంటి మోడళ్లు ఉన్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
Also Read
- BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
ఎగుమతుల్లో భారీ జంప్..
ఎగుమతుల పరంగా కూడా మారుతీ సుజుకి అద్భుతమైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 2024లో కంపెనీ 37,419 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది 26,884 యూనిట్లతో పోలిస్తే 39.1% పెరిగింది. ఇదే కాకుండా.. 2024లో మారుతీ అన్ని సెగ్మెంట్లలో భారీ విక్రయాలు జరిపింది. డిసెంబర్ 2024లో ప్రతి విభాగంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ప్యాసింజర్ కార్ సెగ్మెంట్: స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, సియాజ్ వంటి ప్యాసింజర్ కార్ల విభాగంలో 62,788 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 48,787 యూనిట్లు ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదికి ఇప్పటికి విక్రయాల్లో భారీ మార్పు జరిగింది.
యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్: బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్ 6 వంటి వాహనాలు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ విభాగంలోకి వస్తాయి. ఈ విభాగంలో 55,651 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 45,957 యూనిట్లుగా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ..
కాగా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు మారుతీ ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వని ఈ సంస్థ తన పాపులర్ ఎస్యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఈవెంట్లో కొత్త ఈవీ మోడల్ను ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈమేరకు ఫస్ట్ ఈవీకి సంబంధించిన లుక్ను గతేడాది డిసెంబర్లో విడుదల చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!