Maruti Suzuki: డిసెంబర్లో రికార్డు బద్దలుగొట్టిన మారుతీ సుజుకి.. ఎన్ని కార్లు అమ్మిందంటే?
- దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి
- డిసెంబర్ లో భారీగా కార్ల విక్రయాలు
- ఎగుమతుల్లో భారీ కూడా పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది. మరోసారి సంస్థ రికార్డు బద్ధలు గొట్టింది. ముఖ్యంగా ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా 62,788 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇందులో స్విఫ్ట్ డిజైర్ వంటి మోడళ్లు ఉన్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
ఎగుమతుల్లో భారీ జంప్..
ఎగుమతుల పరంగా కూడా మారుతీ సుజుకి అద్భుతమైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 2024లో కంపెనీ 37,419 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది 26,884 యూనిట్లతో పోలిస్తే 39.1% పెరిగింది. ఇదే కాకుండా.. 2024లో మారుతీ అన్ని సెగ్మెంట్లలో భారీ విక్రయాలు జరిపింది. డిసెంబర్ 2024లో ప్రతి విభాగంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ప్యాసింజర్ కార్ సెగ్మెంట్: స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, సియాజ్ వంటి ప్యాసింజర్ కార్ల విభాగంలో 62,788 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 48,787 యూనిట్లు ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదికి ఇప్పటికి విక్రయాల్లో భారీ మార్పు జరిగింది.
యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్: బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్ 6 వంటి వాహనాలు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ విభాగంలోకి వస్తాయి. ఈ విభాగంలో 55,651 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 45,957 యూనిట్లుగా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ..
కాగా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు మారుతీ ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వని ఈ సంస్థ తన పాపులర్ ఎస్యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఈవెంట్లో కొత్త ఈవీ మోడల్ను ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈమేరకు ఫస్ట్ ఈవీకి సంబంధించిన లుక్ను గతేడాది డిసెంబర్లో విడుదల చేసింది.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!