Maruti Suzuki: డిసెంబర్లో రికార్డు బద్దలుగొట్టిన మారుతీ సుజుకి.. ఎన్ని కార్లు అమ్మిందంటే?
- దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి
- డిసెంబర్ లో భారీగా కార్ల విక్రయాలు
- ఎగుమతుల్లో భారీ కూడా పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది. మరోసారి సంస్థ రికార్డు బద్ధలు గొట్టింది. ముఖ్యంగా ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా 62,788 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇందులో స్విఫ్ట్ డిజైర్ వంటి మోడళ్లు ఉన్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
Also Read
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ఎగుమతుల్లో భారీ జంప్..
ఎగుమతుల పరంగా కూడా మారుతీ సుజుకి అద్భుతమైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 2024లో కంపెనీ 37,419 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది 26,884 యూనిట్లతో పోలిస్తే 39.1% పెరిగింది. ఇదే కాకుండా.. 2024లో మారుతీ అన్ని సెగ్మెంట్లలో భారీ విక్రయాలు జరిపింది. డిసెంబర్ 2024లో ప్రతి విభాగంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ప్యాసింజర్ కార్ సెగ్మెంట్: స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, సియాజ్ వంటి ప్యాసింజర్ కార్ల విభాగంలో 62,788 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 48,787 యూనిట్లు ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదికి ఇప్పటికి విక్రయాల్లో భారీ మార్పు జరిగింది.
యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్: బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్ 6 వంటి వాహనాలు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ విభాగంలోకి వస్తాయి. ఈ విభాగంలో 55,651 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 45,957 యూనిట్లుగా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ..
కాగా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు మారుతీ ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వని ఈ సంస్థ తన పాపులర్ ఎస్యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఈవెంట్లో కొత్త ఈవీ మోడల్ను ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈమేరకు ఫస్ట్ ఈవీకి సంబంధించిన లుక్ను గతేడాది డిసెంబర్లో విడుదల చేసింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!