GST Collections: 2024లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
- 2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మేలు
- జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ. 21 లక్షల 51 వేల కోట్లు
- డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్ల వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.
READ MORE: Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
గత నెలతో పోలిస్తే.. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.16.34 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అక్టోబర్లో స్థూల జీఎస్టీ సేకరణ 9 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాలు, మెరుగైన ఒప్పందాలు, వస్తువుల ఉత్పత్తి కారణంగా ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు ఇది రెండవ అత్యధిక వసూలుగా రికార్డు కెక్కింది. 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. అందులో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రభుత్వ ఖజానాలోకి రూ.21 లక్షల 51 వేల కోట్లు వచ్చాయి. కేవలం జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే.. రూ. 1.80 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేశారు.
READ MORE: December 31 Night: డిసెంబర్ 31 రాత్రి యువకుల ర్యాష్ డ్రైవింగ్.. రూ.90 లక్షల వసూళ్లు!
2024లో జీఎస్టీ వసూళ్లు.. నెలల వారీగా..

ఇదిలా ఉండగా.. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో కొందరు అక్రమార్కులు ఎగవేతలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6084 కేసుల్లో సుమారు 2.01 లక్షల కోట్లు జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సేవల విభాగంలో ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్)తో పాటు ఇనుము, రాగి, తుక్కు వంటి ఖనిజాల విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోందని డీజీజీఐ వార్షిక నివేదికను వెలువరించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం 4872 కేసుల్లో 1.01 లక్షల కోట్ల ఎగవేతలను డీజీజీఐ గుర్తించగా.. ఆ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇందులో రూ.26,605 కోట్లు స్వచ్చందంగా వసూలైనట్లు డీజీజీఐ పేర్కొంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..