GST Collections: 2024లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
- 2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మేలు
- జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ. 21 లక్షల 51 వేల కోట్లు
- డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్ల వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.
READ MORE: Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
గత నెలతో పోలిస్తే.. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.16.34 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అక్టోబర్లో స్థూల జీఎస్టీ సేకరణ 9 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాలు, మెరుగైన ఒప్పందాలు, వస్తువుల ఉత్పత్తి కారణంగా ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు ఇది రెండవ అత్యధిక వసూలుగా రికార్డు కెక్కింది. 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. అందులో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రభుత్వ ఖజానాలోకి రూ.21 లక్షల 51 వేల కోట్లు వచ్చాయి. కేవలం జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే.. రూ. 1.80 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేశారు.
READ MORE: December 31 Night: డిసెంబర్ 31 రాత్రి యువకుల ర్యాష్ డ్రైవింగ్.. రూ.90 లక్షల వసూళ్లు!
2024లో జీఎస్టీ వసూళ్లు.. నెలల వారీగా..

ఇదిలా ఉండగా.. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో కొందరు అక్రమార్కులు ఎగవేతలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6084 కేసుల్లో సుమారు 2.01 లక్షల కోట్లు జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సేవల విభాగంలో ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్)తో పాటు ఇనుము, రాగి, తుక్కు వంటి ఖనిజాల విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోందని డీజీజీఐ వార్షిక నివేదికను వెలువరించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం 4872 కేసుల్లో 1.01 లక్షల కోట్ల ఎగవేతలను డీజీజీఐ గుర్తించగా.. ఆ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇందులో రూ.26,605 కోట్లు స్వచ్చందంగా వసూలైనట్లు డీజీజీఐ పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!