ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు. దీని ప్రకారం.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాబోయే ఒకటి లేదా రెండు దశాబ్దాలకు ఏటా సగటున 8% జీడీపీ వృద్ధిని సాధించాలి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశ జనవరి 31, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 13, 2025న ముగుస్తుంది. యూనియన్ బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను నిర్దేశించేది. దేశ జీడీపీ వృద్ధి మందగిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. మనదేశంలో గతంలో విధించిన…
దేశంలో ఆదాయపు పన్నుపై చర్చలు నడుస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెడతారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేయాలని వాదించారు. ఇతర దేశాలపై సుంకాలు విధించి తన ఖజానాను నింపుకోవాలన్నారు. మన కేంద్ర బడ్జెట్కి ముందు మనం కొన్ని విచిత్రమై, ఊహించలేనటువంటి పన్ను గురించి తెలుసుకుందాం...
గత 500 సంవత్సరాలలో మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండంలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ అంటార్కిటికా ఇప్పటికీ మానవులకు మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ అనేక మీటర్ల పాటు మందపాటి మంచు ఉండటం. నేటికీ.. అంటార్కిటికా అనేది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. ఈ ఖండంలో అనేక రహస్యాలు వెల్లడయ్యాయి. ఈ రహస్యాలు కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక రహస్యం ఇక్కడ ప్రవహించే జలపాతం. దీనిని రక్త జలపాతం అని పిలుస్తారు.
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
“స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ 2021లో విడుదలైన మొదటి సీజన్తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. దానికి సీక్వెల్గా రూపొందిన ‘స్క్విడ్ గేమ్ 2’ గతేడాది చివరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. రెండో సీజన్ మొదటి వారంలోనే 68 మిలియన్ల […]
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. శరీరం లోపల ఉండి నిశ్శబ్దంగా వినాశనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఆరోగ్యంపై కలిగించే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే.. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఇరుకైనవి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తపోటు గుండె…
పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈవీలను ప్రమోట్ చేస్తోంది. ఇటీవల.. భారత ప్రభుత్వం రూ. 10,900 కోట్లతో కూడిన పీఎమ్ఈ డ్రైవ్ స్కీమ్ను ఆమోదించింది. తద్వారా ప్రజలు మరింత ఎక్కువ ఈవీలను కొనుగోలు చేశారు. ఇందుకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఈ కార్లకు జీఎస్టీ, పన్ను, పర్మిట్లలో మినహాయింపు వంటి అనేక ద్రవ్య…
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈసారి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కూడా ఎలక్ట్రిక్ కార్ల హవా కనిపించింది. ఒకవైపు దేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు 'Vayve EVA' కూడా పరిచయమైంది. మరోవైపు, పూణెకు చెందిన మరో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ జెన్సోల్ ఈవీకి చెందిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ కారు 'ఎజియో' కూడా అందరి దృష్టిని ఆకర్శించింది.
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్…