Gate Results: గేట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- గేట్ ఫలితాలు విడుదల..
- అధికారికంగా ప్రకటించిన ఐఐటీ గువాహటి..
- మంచి ర్యాంక్ సాధించిన వారికి టాప్ కాలేజీల్లో సీటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా ప్రకటించింది. ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఫలితాలను ఎలా చూసుకోవాలి..?
ఈ ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, వాటన్నింటినీ పరిశీలించి తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు తమ ఎన్రోల్మెంట్ ఐడీ లేదా ఈ-మెయిల్ అడ్రస్ , పాస్వర్డ్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వడం ద్వారా తమ స్కోర్ కార్డును పొందవచ్చు. అధికారిక వెబ్సైట్ https://gate2026.iitg.ac.in/index.html లో ఫలితాలను చూడవచ్చు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
గేట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించడం అనేది కేవలం ఒక అర్హత మాత్రమే కాదు.. అది విద్యార్థి కెరీర్ను మలుపు తిప్పే ఒక గొప్ప ఆయుధం కూడా. దీని ద్వారా దేశంలోని టాప్ ఐఐటీలు (IITs), ఎన్ఐటీలు (NITs), ఐఐఎస్సీ (IISc) వంటి సంస్థల్లో ఎంటెక్ (M.Tech), ఎంఎస్ (MS), లేదా నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం లభిస్తుంది. నాణ్యమైన విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యే వీలుంటుంది.
Also Read:Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన
ఉన్నత విద్య అభ్యసించే సమయంలో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 12,400 చొప్పున స్కాలర్షిప్ అందిస్తుంది. ఇది విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తుంది. అంతే కాకుండా.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలైన ONGC, BHEL, NTPC, IOCL, GAIL వంటివి గేట్ స్కోరు ఆధారంగానే అభ్యర్థులను నేరుగా టెక్నికల్, మేనేజ్మెంట్ కేడర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. భారీ జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ భద్రత లభిస్తుంది.
పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారు పీహెచ్డీ పూర్తి చేసి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా లేదా శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఏఐ (AI) వంటి రంగాల్లో పనిచేసేందుకు గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు పలు కంపెనీలు ప్రాధాన్యతనిస్తాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!