Gate Results: గేట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- గేట్ ఫలితాలు విడుదల..
- అధికారికంగా ప్రకటించిన ఐఐటీ గువాహటి..
- మంచి ర్యాంక్ సాధించిన వారికి టాప్ కాలేజీల్లో సీటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా ప్రకటించింది. ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఫలితాలను ఎలా చూసుకోవాలి..?
ఈ ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, వాటన్నింటినీ పరిశీలించి తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు తమ ఎన్రోల్మెంట్ ఐడీ లేదా ఈ-మెయిల్ అడ్రస్ , పాస్వర్డ్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వడం ద్వారా తమ స్కోర్ కార్డును పొందవచ్చు. అధికారిక వెబ్సైట్ https://gate2026.iitg.ac.in/index.html లో ఫలితాలను చూడవచ్చు.
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
గేట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించడం అనేది కేవలం ఒక అర్హత మాత్రమే కాదు.. అది విద్యార్థి కెరీర్ను మలుపు తిప్పే ఒక గొప్ప ఆయుధం కూడా. దీని ద్వారా దేశంలోని టాప్ ఐఐటీలు (IITs), ఎన్ఐటీలు (NITs), ఐఐఎస్సీ (IISc) వంటి సంస్థల్లో ఎంటెక్ (M.Tech), ఎంఎస్ (MS), లేదా నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం లభిస్తుంది. నాణ్యమైన విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యే వీలుంటుంది.
Also Read:Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన
ఉన్నత విద్య అభ్యసించే సమయంలో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 12,400 చొప్పున స్కాలర్షిప్ అందిస్తుంది. ఇది విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తుంది. అంతే కాకుండా.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలైన ONGC, BHEL, NTPC, IOCL, GAIL వంటివి గేట్ స్కోరు ఆధారంగానే అభ్యర్థులను నేరుగా టెక్నికల్, మేనేజ్మెంట్ కేడర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. భారీ జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ భద్రత లభిస్తుంది.
పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారు పీహెచ్డీ పూర్తి చేసి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా లేదా శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఏఐ (AI) వంటి రంగాల్లో పనిచేసేందుకు గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు పలు కంపెనీలు ప్రాధాన్యతనిస్తాయి.
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!