China: పది రోజులు మంచులో చిక్కుకున్న యువకుడు.. ఆకలి బరించలేక టూత్ పేస్ట్ తిని..
- మంచు పర్వతంపై తప్పిపోయిన యువకుడు
- ఆకలి తీర్చుకునేందుకు టూత్ పేస్ట్ తిన్న యువకుడు
- అతడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీం
- అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు. ఆహారం లేక పోవడంతో విలవిల లాడాడు. 10 రోజుల తర్వాత రెస్క్యూ అండ్ రిలీఫ్ టీం ఆ యువకుడని గుర్తించింది. ఆ టీం అతని ప్రాణాలు కాపాడింది. ఈ పది రోజుల పాటు ఆహారం లేకపోవడంతో అతడు చాలా బలహీనంగా మారాడు. ఆహారం కొరతగా ఉన్నప్పటికీ నది నీళ్లు తాగుతూ.. ఆకలి తీర్చుకోవడానికి తన వద్ద ఉన్న టూత్పేస్ట్ సైతం తిన్నాడు.
READ MORE: IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 18 ఏళ్ల సన్ లియాంగ్ పర్వాతారోహకుడు. ఫిబ్రవరి 8న షాంగ్జీ ప్రావిన్స్లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటైన క్విన్లింగ్ పర్వతాలను ఒంటరిగా అధిరోహించేందుకు వెళ్లాడు. ఈ పర్వతంపై అసాధారణ వాతావరణం ఉంది. ఈ పర్వతం అధిరోహించడం ఓ కఠినమైన చర్య. ఈ పర్వతంపై అనేక రకాల జంతువులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా.. లియాంగ్ తన అడుగులు ముందుకు వేశాడు. కానీ కేవలం రెండు రోజులకే తప్పిపోయాడు. దారి తప్పి, లియాంగ్ నది ఒడ్డున నడుస్తూనే ఉన్నాడు. పర్వతంపై నుంచి పడి కుడి చేయి విరిగి పోయింది. దీంతో అతను ఒక చోట ఆకుల సహాయంతో తాత్కాలిక మంచం ఏర్పాటు చేసుకున్నాడు. తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతూ సహాయం కోసం ఎదురు చూశాడు.
READ MORE: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు
కుటుంబంతో లియాంగ్ సంబంధాలు కట్ అవ్వడంతో అతన్ని సంప్రదించలేకపోయారు. ఈ సమాచారాన్ని స్థానిక రెస్క్యూ బృందాలకు తెలియజేస్తారు. రోజుల తరబడి కష్టపడి వెతికిన టీం సభ్యులు ఫిబ్రవరి 17న అతన్ని కనుగొన్నారు. రెస్క్యూ టీం ప్రకారం.. బాలుడు ప్రమాదకరమైన కొండను ఎక్కుతున్నాడు. గత 20 ఏళ్లలో ఈ మార్గంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల దృష్ట్యా, స్థానిక పరిపాలన 2018 లో ఈ పర్వతాన్ని ఎక్కడం నిషేధించింది. కానీ.. కొంతమంది ధైర్యవంతులు రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన ప్రాంతంలో తప్పిపోయి నిర్జీవంగా దొరికి వ్యక్తి లియాంగ్ మాత్రమే.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..