China: పది రోజులు మంచులో చిక్కుకున్న యువకుడు.. ఆకలి బరించలేక టూత్ పేస్ట్ తిని..
- మంచు పర్వతంపై తప్పిపోయిన యువకుడు
- ఆకలి తీర్చుకునేందుకు టూత్ పేస్ట్ తిన్న యువకుడు
- అతడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీం
- అసలు ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు. ఆహారం లేక పోవడంతో విలవిల లాడాడు. 10 రోజుల తర్వాత రెస్క్యూ అండ్ రిలీఫ్ టీం ఆ యువకుడని గుర్తించింది. ఆ టీం అతని ప్రాణాలు కాపాడింది. ఈ పది రోజుల పాటు ఆహారం లేకపోవడంతో అతడు చాలా బలహీనంగా మారాడు. ఆహారం కొరతగా ఉన్నప్పటికీ నది నీళ్లు తాగుతూ.. ఆకలి తీర్చుకోవడానికి తన వద్ద ఉన్న టూత్పేస్ట్ సైతం తిన్నాడు.
READ MORE: IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
- Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 18 ఏళ్ల సన్ లియాంగ్ పర్వాతారోహకుడు. ఫిబ్రవరి 8న షాంగ్జీ ప్రావిన్స్లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటైన క్విన్లింగ్ పర్వతాలను ఒంటరిగా అధిరోహించేందుకు వెళ్లాడు. ఈ పర్వతంపై అసాధారణ వాతావరణం ఉంది. ఈ పర్వతం అధిరోహించడం ఓ కఠినమైన చర్య. ఈ పర్వతంపై అనేక రకాల జంతువులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా.. లియాంగ్ తన అడుగులు ముందుకు వేశాడు. కానీ కేవలం రెండు రోజులకే తప్పిపోయాడు. దారి తప్పి, లియాంగ్ నది ఒడ్డున నడుస్తూనే ఉన్నాడు. పర్వతంపై నుంచి పడి కుడి చేయి విరిగి పోయింది. దీంతో అతను ఒక చోట ఆకుల సహాయంతో తాత్కాలిక మంచం ఏర్పాటు చేసుకున్నాడు. తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతూ సహాయం కోసం ఎదురు చూశాడు.
READ MORE: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు
కుటుంబంతో లియాంగ్ సంబంధాలు కట్ అవ్వడంతో అతన్ని సంప్రదించలేకపోయారు. ఈ సమాచారాన్ని స్థానిక రెస్క్యూ బృందాలకు తెలియజేస్తారు. రోజుల తరబడి కష్టపడి వెతికిన టీం సభ్యులు ఫిబ్రవరి 17న అతన్ని కనుగొన్నారు. రెస్క్యూ టీం ప్రకారం.. బాలుడు ప్రమాదకరమైన కొండను ఎక్కుతున్నాడు. గత 20 ఏళ్లలో ఈ మార్గంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల దృష్ట్యా, స్థానిక పరిపాలన 2018 లో ఈ పర్వతాన్ని ఎక్కడం నిషేధించింది. కానీ.. కొంతమంది ధైర్యవంతులు రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన ప్రాంతంలో తప్పిపోయి నిర్జీవంగా దొరికి వ్యక్తి లియాంగ్ మాత్రమే.
తాజావార్తలు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో